సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలాకాలం తర్వాత మహేష్ ని చాలా కొత్తగా, స్టైలిష్ గా ప్రెసెంట్ చేశాడు దర్శకుడు పరశురామ్. ట్రైలర్ చూస్తే ప్రతి ఫ్రేమ్ లో మాసివ్ యాక్షన్ తో పాటు ఎంటెర్టైనింగ్ డైలాగ్స్ పుష్కలంగా ఉన్నాయి.
ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. ఇక ఈ ట్రైలర్ లో మహేష్ నోటి నుండి ఏపీ సీఎం జగన్ డైలాగ్ రావడం విశేషం. సోషల్ మీడియాలో మహేష్ పలికిన జగన్ డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ లో హీరోయిన్ తో మాట్లాడుతూ.. “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే డైలాగ్ చెప్పాడు మహేష్. ఈ డైలాగ్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి.
ఇక ఈ డైలాగ్ ని గతంలో దివంగత ఏపీ సీఎం రాజశేఖర రెడ్డిగారు 2004 ఎలక్షన్స్ టైంలో చెప్పారు. అలాగే 2019 ఎలక్షన్స్ సమయంలో సీఎం జగన్ నోటి నుండి ఈ డైలాగ్ మనం విన్నాం. ఇప్పుడు మహేష్ నోట ఈ డైలాగ్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి మహేష్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అయితే.. ఈ డైలాగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ మహేష్ చెప్పిన డైలాగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.