బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రోజురోజుకూ ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలా రీసెంట్ గా మొదలైన ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ ఒకటి. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవరిస్తున్న ఈ షోలో నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా కొనసాగుతున్నారు. అయితే.. షో పేరే ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ కాబట్టి.. ప్రతి ఎపిసోడ్ లో రియల్ జంటలతో పాటు రీల్ జంటలు కూడా షోలో పాల్గొంటున్నారు. సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్ తో పాటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా తమ తమ జంటలతో షోలో సందడి చేస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ షో.. ఈటీవీలో ప్రతి మంగళవారం రాత్రి ప్రసారం అవుతోంది.
ఈ క్రమంలో వచ్చే మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించి సరికొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో మొదటి నుండి చివరి వరకు యాంకర్ శ్రీముఖి చేసిన రచ్చ మామూలుగా లేదు. సీరియల్ నటి శ్రీవాణి భర్తపై.. కమెడియన్ రాకింగ్ రాకేష్ పై డబుల్ మీనింగ్ పంచులు వేసింది. ఆఖరికి జడ్జిలు శివబాలాజీ, స్నేహ ‘లవ్ గేమ్స్’ అనంటే.. అమ్మానాన్న ఆటలు అంటూ డబుల్ మీనింగ్ పంచులతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుండగా.. శ్రీముఖి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి గ్లామర్ షో రచ్చ గురించి తెలిసిందే. మరి మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రోమోలో శ్రీముఖి మాటలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.