అందం, అభినయం కలబోసిన అజంతా శిల్పంలా ఉంటుంది అనసూయ. తన అందంలో కుర్రకారును ఎంత కవ్విస్తుందో.. తన మాటలతో కూడా అంతే ఘాటుగా స్పందిస్తుంది. తాజాగా ఆంటీ వివాదం గురించి, కేసుల గురించి మీకు తెలిసిందే. అయితే అవన్నీ పక్కన పెడితే తాజాగా విడుదలైన ఓ ప్రోమోలో తన డ్యాన్స్ తో, తన అభినయంతో యూత్ కి మత్తెక్కిస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఈటీవీ 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘భలే మంచి రోజు’ అనే ఓ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించింది. దానికి జబర్దస్ నుంచి అందరు ప్రముఖులతో పాటు జడ్జి ఇంద్రజ, అన్నపూర్ణమ్మలు, ఈటీవీ సీరియల్ నటీ నటులు కూడా వచ్చారు. ఇక ఎప్పటిలాగే ఈ వేడుకలో కూడా వారు అభిమానులను మురిపిస్తారని అర్థం అవుతోంది. అయితే ఈ ప్రోమో మెుత్తానికి అనసూయ వేసిన డ్యాన్సే హైలెట్ అని చెప్పుకొవాలి.
సముద్రంలో నుంచి బయటపడిన ముత్యంలా అనసూయ మెరిసిపోతోంది. “కన్నానులే.. కలయికలు” అన్న పాటకు తన దైనహోయలు ఒలకబోసింది ఈ అమ్మడు. కేవలం డ్యాన్సే కాకుండా తన కళ్ల అభినయంతో షోలో ఉన్న వారందరినే కాకుండా ప్రేక్షకులను సైతం మైమరపించింది. ఈ డ్యాన్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అనసూయ అభినయం గురించే. ఆ పెదవిపై చెరగని చిరునవ్వుతో.. తన ముఖ కవలికలతో కుర్రకారు గుండెల్ని మెలిపెట్టిందనే చెప్పాలి.
ఇక ఈ డాన్స్ చూసిన ఇంద్రజ అద్భుతంగా ఉంది అస్సలు చూపు తిప్పుకోనివ్వలేదు అంటూ ప్రశంసలు కురింపించింది. ఇక హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, ఇమ్మాన్యుయేల్ లు తమ దైన పంచులతో సీరియల్ నటులను ఓ ఆట ఆడుకున్నారు. రెండు టీంలుగా విడిపోయి పోటీ పడ్డారు. ఇక ఆది ఎప్పటిలాగే అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడంలో మునిగి పోయాడు. మరి అనసూయ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.