కొంత మంది హీరోలు కాస్త పేరూ.. డబ్బు రాగానే తామేదో గొప్పవారమన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఎదిగే కొద్ది ఒదిగి ఉంటారు. వారికి కావాల్సినంత పేరూ.. డబ్బు.. అధికారం అన్నీ ఉన్నా కానీ సామాన్యుడిలా ఉంటారు. ఇదే కోవలోకి వస్తారు మన బాలయ్య బాబు. తాజాగా ఓ సాధారణ వ్యక్తితో బాలయ్య చేసిన సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ.. తన తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని తన నట విశ్వరూపంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. బాలయ్య ఎంత సరదాగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఇక బాలయ్య చేసిన ''అన్ స్టాపబుల్'' షో ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. తన వాక్చాతుర్యంతో గెస్టుల మనసులు దోచుకున్నారు. అయితే డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం టర్కీ వెళ్లింది. ఇక టర్కీలో బాలయ్య ఉదయం ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడే కూర్చున్న ఓ కుటుంబంతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించాడు. బాలయ్య మాట్లాడుతూ..'' భాయ్ మీరు టిఫిన్ చేశారా? నేను చేశాను. ఇక నేను ఎవరో తెలుసా? హీరోని, మై హిందూపురం ఎమ్మెల్యే హూ అనగానే ఆ వ్యక్తి తెలుసు సార్ అన్నాడు. అదీ కాక నేను బసవతారకం క్యాన్సర్ హస్పిటల్ ఛైర్మన్ ఇన్ని పనులు చేస్తూ చాలా సంతోషంగా ఉన్నా.. ఏ పనీ లేక పోతే బోర్ కొడుతుంది. అంటూ అతడితో చెప్పుకొచ్చాడు. ఏదో మంత్రం చదువుతూ మందులు వేసుకున్నాడు బాలయ్య. ఇక ఎదురుగా కూర్చున్న మహిళను చూపిస్తూ..'' వీళ్లు ఇంట్లో కూర్చుని సీరియళ్లు చూసి మైండ్ కరాబు చేసుకుంటారు. నేనేమంటాను అంటే టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది.. అస్సలు చూడకపోతే మైండ్ కు మంచిది అని చెప్పగానే అక్కడ అంతా నవ్వులు చిందాయి. ఇలా సరదాగా తాను హీరోని అన్న గర్వం లేకుండా చాలా సింపుల్ గా తమతో మాట్లాడటంతో ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో చూసిన బాలయ్య అభిమానులు మా బాలయ్య బాబా మజాకా! అంటూ తెగ మురిసిపోతున్నారు. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: కోబ్రా మూవీ రివ్యూ ఇదీ చదవండి: ఆ సమయంలో నా తలరాత అలా ఉంది: సాయిధరమ్ తేజ్