అందమైన రూపం.. చక్కని చిరునవ్వు.. గలగల మాటల ప్రవాహం.. వీటికి నిలువెత్తు రూపమిస్తే.. అది యాంకర్ అనసూయ భరద్వాజ్. యాంకరింగ్కు గ్లామర్ టచ్ ఇచ్చింది అనసూయ. ట్రెడిషనల్, మోడ్రన్.. ఇలా ఏ దుస్తుల్లో అయినా సరే.. తన అందంతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. మాటలతో మాయ చేస్తూ.. యాంకర్గా ఏళ్ల పాటు బుల్లితెర మీద సందడి చేసింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్గా మారింది అనసూయ. ప్రస్తుతం ఆమె చేతిలో పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాల్లో బిజీ కావడంతో.. ప్రస్తుతం అనసూయ జబర్దస్త్కు గుడ్బై చెప్పింది. వరుస సినిమాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. ఇక కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్గా ఉంటుంది అనసూయ. ఫోటోషూట్స్, వెకేషన్స్, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. అభిమానలను అలరిస్తుంటింది.
తాజాగా అనసూయ.. శ్రీకాళహస్తి వెళ్లింది. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. దైవ దర్శనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతోన్నాయి. సంప్రదాయ దుస్తుల్లో నిండుగా ఉన్న అనసూయను చూసి.. అద్భుతంగా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె.. ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా తెరకెక్కతుందని సమాచారం. ఈ సిరీస్లో అనసూయ.. కన్యాశుల్కం నాటకంలో ప్రధాన పాత్రధారి మధురవాణి పాత్రలో నటించనుందని సమాచారం. డైరెక్టర్ క్రిష్.. ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నాడని.. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
క్షణం సినిమాలో అనసూయ తన నటనతో అలరించింది. ఆ ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర.. అనసూయ కెరీర్ను మలుపు తిప్పింది. ఆ తర్వాత నుంచి అనసూయకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అనసూయ తెలుగులోనే కాక.. ఇతర భాషల్లో కూడా నటిస్తోంది. ఇప్పటికే ఓ మలయాళీ చిత్రంలో నటించిన అనసూయకు మరో మలయాళీ మూవీలో అవకాశం వచ్చిందని సమాచారం. వీటితో పాటు ఓ రెండు తమిళ సినిమాల్లోను నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ప్రసుత్తం అనసూయ.. బన్నీ పుష్ప 2లో కీలక పాత్రలో కనిపించబోతుంది. అలానే కృష్ణవంశీ రంగ మార్తండలో కూడా నటించింది.