మార్చి 11న విడుదలైన ప్రభాస్ రీసెంట్ హిట్ రాధేశ్యామ్ రికార్డుల వేటలో పడింది. మొదటి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.151 కోట్ల గ్రాస్ తో 2022లో బిగ్గెస్ట్ ఓపినింగ్స్ వచ్చిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, స్పిరిట్, ప్రాజెక్ట్-K చిత్రాలు ఉన్నాయి. ప్రాజెక్ట్-K చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. అమితాబచ్చన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన వాహనాలు కావాలని గతంలో నాగ్ అశ్విన్ ఆనంద్ మహీంద్రాకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
What a beautiful campus, where nature meets cutting edge tech…a fruitful start to our journey with @Velu_Mahindra and team..thank you so much @anandmahindra sir. This promises to be v exciting.🙏 #mahindraresearchvalley #projectk pic.twitter.com/FH7kJ8VP53
— Nag Ashwin (@nagashwin7) March 13, 2022
వెహికల్స్ కు సంబంధించి నాగ్ అశ్విన్ మహీంద్రా రీసెచ్ వ్యాలీని నాగ్ అశ్విన్ సందర్శించాడు. అక్కడున్న సిబ్బందితో వారి సినిమాకు ఎలాంటి వాహనాలు కావాలి అనేది డిస్కస్ చేశాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ లో నాగ్ అశ్విన్ పోస్ట్ చేశాడు. ‘ఎంతో అద్భుతమైన ప్రదేశం. ప్రకృతి- సాంకేతికత కలుసుకునే అద్భుతమైన చోటు ఇది. ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు’ అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.
‘నాగ్ అశ్విన్ మీరు తీయబోయే బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ చిత్రం నన్ను ఎంతో ఎగ్జైట్ కు గురి చేస్తోంది. మీరు తప్పకుండా హాలీవుడ్ ను బీట్ చేస్తారని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ఆనంద్ మహింద్రా నాగ్ అశ్విన్ చిత్రాన్ని కొనియాడారు. ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Well @nagashwin7 I have to admit you have got me as excited now about this blockbuster sci fi film you’re creating. I have a hunch you’re going to beat Hollywood hollow… https://t.co/XiqyaEBIDr
— anand mahindra (@anandmahindra) March 13, 2022