మంచిని వెతుక్కుంటూ చెడు వచ్చినట్టే.. నమ్మకాన్ని వెతుక్కుంటూ మోసం అనేది కూడా వస్తుంది. ఏ రంగంలో అయినా కొందరు కొందరిని నమ్మి మోసపోవడమన్నది సహజం. తాజాగా కొరియోగ్రాఫర్గా, డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్.. నమ్మకద్రోహానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జె.డి.చక్రవరిని తన గురువుగా భావిస్తానని, అలాంటి వ్యక్తి నిర్మాతతో కలిసి తనను మోసం చేశాడని అన్నారు.
ఉగ్రం సినిమా చేసే సమయంలో నిర్మాత నక్షత్ర, అతని స్నేహితుడు, జె.డి.చక్రవర్తి.. ఈ ముగ్గురూ తనకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. మూడు నెలల్లో సినిమా ఫినిష్ చేశానని, ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైందని.. ఐతే ఒక వ్యక్తి మధ్యలో రావడం వల్ల మొత్తం కొలాప్స్ ఐపోయిందని అన్నారు. ఖాసిమ్ అని నిర్మాత ఫ్రెండ్ ఒకడు మధ్యలో వచ్చాడని, చక్రవర్తి ఫ్యాన్ అంటూ హడావుడి చేసి సినిమాని నాశనం చేశాడని విమర్శించారు. ఫస్ట్ కాపీ అయిపోయాక తనకు చెప్పకుండా కథలో మార్పులు చేసుకుంటూ పోయారని, డైరెక్టర్కి చెప్పకుండా అలా చేయడం భావ్యమేనా అని అన్నారు. చక్రవర్తి కూడా మోసం అని తెలిసి కూడా ఖాసిమ్ చెప్పినట్లు చేసుకుంటూ పోయాడని అమ్మ రాజశేఖర్ అన్నారు.
యాక్చువల్గా ఉగ్రం మూవీ పోస్టర్ రిలీజ్ టైములోనే 60 లక్షల బిజినెస్ జరిగిందని, ఆ విషయం తనకు తెలియనివ్వకుండా దాచారని అన్నారు. అగ్రిమెంట్ ప్రకారం తనకు షేర్ ఇవ్వలేదని, మోసం చేయాలని ప్లాన్ చేసుకున్నారని అమ్మ రాజశేఖర్ గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం డబ్బులో సగం వాటా ఇవ్వాలని, సగం ఇవ్వకపోయినా కనీసం పది లక్షలైనా ఇవ్వాలి కదా అని అడిగితే చేతిలో 50 వేలు మాత్రమే పెట్టారని అన్నారు. మొదట్లో నిర్మాత నక్షత్ర మంచిగానే ఉన్నా డబ్బులు రావడంతో మారిపోయాడని విమర్శించారు. తానేదో దిల్ రాజులా ఫీలయ్యారని విమర్శించారు. ఖాసిమ్ అనే వ్యక్తి మాటలు నమ్మి.. వెంటనే రిలీజవ్వాల్సిన సినిమా నాలుగేళ్లయినా రిలీజ్ కాకుండా చేసుకున్నారని అన్నారు. రిలీజ్ అయి ఉంటే చక్రవర్తి కెరీర్ బాగుండేదని, తన కళ్ళు తనే పొడుచుకున్నాడని విమర్శించారు. “ఫస్ట్ కాపీ అయిపోయిన సినిమాని, డైరెక్టర్ అనుమతి లేకుండా మార్చే హక్కు వాళ్లకి ఎక్కడిది? చక్రవర్తి చేసింది నమ్మకద్రోహమే కదా” అని అన్నారు.
ఒకసారి అమ్మకు సీరియస్ ఐతే హాస్పిటల్లో జాయిన్ చేశానని, ఆ సమయంలో డబ్బు అవసరమైందని అన్నారు. అయితే నా డబ్బు నాకు ఇచ్చేయమని అడిగానని, పార్టనర్ షిప్ సంగతి సరే.. అన్ని హక్కులూ ఇచ్చేస్తాను, కనీసం లక్ష రూపాయలయినా ఇవ్వమని అడిగానని అన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన బాధపడ్డారు. వాళ్ళేదో నన్ను మోసం చేశారనుకుంటున్నారు, కానీ వాళ్ల జీవితాలని వాళ్లే నాశనం చేసుకున్నారని అన్నారు. నన్ను నమ్ముకుని ఉంటే చక్రవర్తికి పెద్ద హిట్ వచ్చేదని, బంగారం లాంటి లైఫ్ని మిస్ చేసుకున్నాడని విమర్శించారు. మరి అమ్మ రాజశేఖర్ కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.