‘అక్కినేని అఖిల్’ తాజా చిత్రం ‘మోస్ట్ ఎల్జిబుల్’ బ్యాచిలర్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. అఖిల్, పూజా హెగ్దే జంటగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. కొవిడ్ కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రంలో అఖిల్, పూజా హెగ్దే లుక్స్ ఎంతో కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లో లవ్, కామెడీ, క్లారిటీ, క్రేజీ క్వశ్చన్స్తో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రలో నటిస్తున్నారు.