టాలీవుడ్ బడా హీరోలు, పెద్ద బ్యానర్లో సినిమాలు ప్రకటిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. అందులోనూ రిపీట్ కాంబినేషన్స్లో సినిమాలు వస్తున్నాయంటే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ సినిమాలో నటించే స్టార్ కాస్టింగ్
టాలీవుడ్ బడా హీరోలు, పెద్ద బ్యానర్లో సినిమాలు ప్రకటిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. అందులోనూ రిపీట్ కాంబినేషన్స్లో సినిమాలు వస్తున్నాయంటే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ సినిమాలో నటించే స్టార్ కాస్టింగ్ నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు ప్రతీది చర్చే. అయితే కొన్ని సార్లు అనుకోకుండా సినిమా షూటింగ్ లేటు కావడం, ఇతర సమస్యల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. బడా హీరో, డైరెక్టర్ అయితే ఒక్క సినిమా చేస్తారు కానీ.. మిగిలిన కాస్ట్ అంతా ఇతర సినిమాలను ఒప్పుకోవడం వల్ల డేట్స్ సర్ధుబాటు చేయలేక.. ఒక్కోసారి ఆ ప్రాజెక్టుల నుండి తప్పుకుంటారు. అదే జరిగింది గుంటూరు కారం సినిమా విషయంలో.
మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఇటీవల కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో మహేష్ మాస్ లుక్లో కనిపించారు. అలాగే ఈ సినిమాలో త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన పూజాహెగ్గే, ప్రస్తుత ట్రెండీ నటి శ్రీలీలను హీరోయిన్గా ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇటీవల బాగా చక్కర్లు కొట్టిన వార్త.. గుంటూరు కారం నుండి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకున్నారని హల్ చల్ చేసింది. అయితే దీనిపై తమన్ స్పందించారంటూ..వార్తలు వచ్చాయి. ఇప్పుడు పూజా కూడా క్లారిటీ ఇచ్చిందట.
తెలుగు, హిందీ సినిమాలతో మోస్ట్ బిజియెస్ట్ తారగా మారిపోయింది పూజా హెగ్డే. ఆమె సినిమాలు ప్లాప్ అవుతున్నప్పటికీ.. అవకాశాలకేమీ కొదవలేదు. అయితే వచ్చిన మంచి అవకాశాన్నికూడా ఇప్పుడు చేజార్చుకుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె టీం స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నది వాస్తవమేనని టీం తెలిపింది. గుంటూరు కారం సినిమా షూటింగ్ చాలా ఆలస్యం కావడమే కాకుండా.. ఇప్పటికే ఒప్పుకున్న ఇతర సినిమా షూటింగులకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతోనే ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలిపింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో మరొక హీరోయిన్గా నటిస్తున్న శ్రీ లీలను మెయిన్ హీరోయిన్గా తీసుకున్నారని తెలుస్తోంది.