సెలబ్రిటీలు ఏ చిన్న వేడుక చేసుకున్నా చాలా ఘనంగా చేసుకుంటారు. ఇక అది మహిళలకు సంబంధించింది అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ప్రస్తుతం శ్రావణ మాస కాలం నడుస్తోంది. ఈ కాలంలో మహిళలు ఇంట్లో వరలక్ష్మీ పూజలు చేయడం సహజమే. అయితే తాజాగా హీరోయిన్ స్నేహ తన ఇంట్లో వరలక్ష్మీ పూజను చాలా గ్రాండ్ గా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పూజకు కొంత మంది అలనాటి హీరోయిన్స్ సైతం వచ్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
తాజాగా నటి స్నేహ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరిగింది. ఈ పూజకు బంధువులతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖులు కూడా హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి అలనాటి అందాల తార హీరోయిన్ రంభతో పాటు మరో హీరోయిన్ శ్రీదేవీ విజయ్ కుమార్ కూడా వేడుకకు వచ్చింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రంభ, శ్రీదేవీలను ఫొటోలలో చూసిన అభిమానులు తెగ మూరిసి పోయారు.
ఇక పూజా కార్యక్రమాల్లో స్నేహ ఎంతో చలాకిగా, హుషారుగా కనిపించింది. వచ్చిన అతిథులను పలకరించడం దగ్గర నుంచి వారికి పలహారాలు అందివ్వడం వరకు అన్ని ఆమె దగ్గర ఉండి చూసుకుంది. అతిథుల కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగింది. చిర కట్టులో స్నేహ బుట్ట బొమ్మలా ఉంది. తన భర్త ప్రసన్నతో కలిసి వేడుకకి వచ్చిన రంభ, శ్రీదేవీలతో సరదాగా ముచ్చటించింది.
స్నేహ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా తన కొడుకు విహాన్ పుట్టిన రోజు సందర్భంగా షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసింది. ఈ క్రమంలోనే మరో సారి తన కుటుంబంతో కలిసి వేడుకల్లో పాల్గోన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ఫొటోలపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.