ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్ ల విషయంలో అనిశ్చితి నెలకొంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, మూవీ బడ్జెట్ పెరగడం.. హీరోల రెమ్యూనరేషన్, ఆర్టిస్టుల వేతనాలు పెరగడం లాంటి విషయాలతో నిర్మాతలు షూటింగ్స్ ని నిలిపివేశారు. ఇలాంటి సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదే లైగర్ హీరో విజయ్, మైక్ టైసన్ ల రెమ్యూనరేషన్ ల వార్త. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'లైగర్'. ఈ మూవీని పూరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి జనాల్లో నానుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే మూవీ యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. దీంతో ఈ మూవీ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం లైగర్ మూవీ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కు సంబంధించి ఓ వార్త పరిశ్రమలో చెక్కర్లు కొడుతోంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కోసం ఏకంగా రూ. 35 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా భారీ మెుత్తంలో పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. లైగర్ సినిమా కోసం మైక్ ఏకంగా రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ అనన్య పాండేకు రూ. 3 కోట్ల రూపాయాలు పారితోషికంగా ఇచ్చినట్లు వినికిడి. అయితే ప్రస్తుతం ఈ పారితోషికాలకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారడంతో కొందరు నెటిజన్స్ స్పందిస్తు.. ''ఏంటి మైక్ మామా ఇదీ.. మా హీరో కంటే ఎక్కువ తీసుకుంటున్నావు'' అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25 న థియోటర్ల లోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ కావడంతో బాక్సాఫీస్ రికార్డులు బద్దల్ కావడం పక్కా అంటూ అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలోనే వారి పారిలోషికాలు బయటికి రావడంతో సగటు సినీ ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి విజయ్, మైక్ టైసన్ లు ఇంత భారీ మెుత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మహేష్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్ ఇదీ చదవండి: Dil Raju: కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో మీడియాపై ఫైర్ అయిన దిల్ రాజు