తెలుగు బుల్లితెరపై పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఏదైనా ఉందంటే.. ఢీ అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఈ డాన్స్ రియాలిటీ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రస్తుతం 14వ సీజన్ రన్ అవుతుండగా.. గణేష్ మాస్టర్, నటి ప్రియమణి, హీరోయిన్ నందిత శ్వేత జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, నవ్యస్వామి, రవికృష్ణ షోలో సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఢీ వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే.. ప్రోమోలో పెరఫార్మన్స్ లు, ప్రదీప్ – హైపర్ ఆదిల ఫన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ చివరిలో లేడీ జడ్జి నందిత కంటతడి పెట్టుకుంది. ఆమె బర్త్ డే సందర్భంగా ఢీ తరపున అడ్వాన్స్ విషెస్ చెబుతూ గిఫ్ట్ అందించాడు ప్రదీప్. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసిన వెంటనే నందిత ఒక్కసారిగా స్టేజిపై కూర్చొని ఏడ్చేసింది. ప్రస్తుతం నందిత ఎమోషనల్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.