ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని ధైర్యంగా బయటకు చెప్పిందో.. ఆ తర్వాత మరికొంత మంది కథానాయికలు తమ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. తాజాగా యంగ్ యాక్ట్రెస్ నందితా శ్వేత గత కొంత కాలంగా తను ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకిందని ధైర్యంగా బయటకు చెప్పిందో.. ఆ తర్వాత మరికొంత మంది కథానాయికలు తమ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. తాజాగా యంగ్ యాక్ట్రెస్ నందితా శ్వేత గత కొంత కాలంగా తను ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నందితా ప్రస్తుతం యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ‘హిడింబ’ అనే యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్గా చేసింది. అనిల్ కన్నెగంటి దర్శకుడు. ఈ నెల 20న మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ చేస్తున్నారు టీం. అందులో భాగంగా నందిత ఈ చిత్రంతో పాటు తన పర్సనల్ విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘హిడింబ’ ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. ఆద్య అనే సీరియస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. హీరోకి సమానంగా ఉంటుంది నా రోల్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది. నేను గత నాలుగేళ్లుగా ఫైబ్రోమాల్జియా (Fibromyalgia) అనే వ్యాధితో బాధపడుతున్నాను. (వెన్నెముక, కండరాలకు సంబంధించిన వ్యాధి. ఆకస్మాత్తుగా నీరసం రావడం, మొదడు నొప్పిని గ్రహించలేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు).
దీని వల్ల హెవీ వర్కౌట్స్, డైట్ లాంటివి చెయ్యకూడదు. అలాగే నిద్రలేమి ఉండకూడదు. కానీ ఈ సినిమా కోసం ఇవన్నీ చెయ్యాల్సి వచ్చింది. దాని వల్ల కొంత స్ట్రగుల్ అయ్యాను. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలానే ‘హిడింబ’ కూడా పెద్ద హిట్ అవుతుంది. నేను నటించిన ‘మంగళవారం’, ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది.