అనుకోకుండా అదా అనారోగ్యానికి గురవడంతో ప్రమోషన్కి ముందే ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీ ఉన్నట్లు నిర్థారణ అయిందని సన్నిహితులు తెలిపారు.
అదా శర్మ.. ఇటీవల సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ మూవీతో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఎన్ని విమర్శలొచ్చినా కానీ అంతకుమించి ఆదరణ దక్కించుకుందీ చిత్రం. ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదా రీసెంట్గా నటించిన ‘కమాండో’ వెబ్ సిరీస్ ఆగస్టు 11 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు టీమ్. అయితే అనుకోకుండా అదా అనారోగ్యానికి గురవడంతో ప్రమోషన్కి ముందే అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. అదా శర్మకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీ ఉన్నట్లు నిర్థారణ అయిందని ఆమె సన్నిహితులు తెలిపారు.
‘కమాండో’ సిరీస్లో వచ్చిన రెండు సినిమాలు ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. అదే స్థాయిలో ఈ సిరీస్ తెరెక్కిస్తున్నారు. అదా, భావనా రెడ్డి అనే పాత్రలో కనిపించనుంది. ప్రేమ్, అమిత్ సియాల్, ముఖేష్ ఛబ్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విపుల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా సోషల్ మీడియాలో తన పర్సనల్, ప్రొఫెషన్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ షేర్ చేస్తూ యాక్టివ్గా ఉండే అదా, అనారోగ్యం గురించి మాత్రం ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ ‘కమాండ్’ టీం, సినీ వర్గాల వారు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.