సినిమా కోసం 24 శాఖలకు సంబంధించిన వారంతా ఎంతో కష్టపడుతుంటారు. నటీనటులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్, మేకప్ డిపార్ట్మెంట్.. ఇలా ప్రతి ఒక్క విభాగంతో కో ఆర్టినేట్ చేసుకుంటూ రూపొందించాలి దర్శకుడు.
సినిమా కోసం 24 శాఖలకు సంబంధించిన వారంతా ఎంతో కష్టపడుతుంటారు. నటీనటులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్స్, మేకప్ డిపార్ట్మెంట్.. ఇలా ప్రతి ఒక్క విభాగంతో కో ఆర్టినేట్ చేసుకుంటూ రూపొందించాలి దర్శకుడు. ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయింది. కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ అవుతుందనుకుంటే తెలుగు నుంచి హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోకి డబ్ చేస్తున్నారు. దీని ద్వారా ఎంతోమందికి పని దొరుకుతుంది. డైలాగ్స్, సాంగ్స్ రాసే రైటర్స్, సింగర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్లు వర్క్ చేస్తుంటారు. అయితే వాయిస్ ఇవ్వడం, పాట పాడడం లాంటివి ఎవరైనా పాపులర్ పర్సన్ చేస్తే దాదాపుగా ఆ విషయాలు బయటకి చెప్పేస్తుంటారు.
కానీ ఓ హీరోయిన్ మాత్రం తాను ‘పుష్ప’ మూవీకి వర్క్ చేశానని కాస్త ఆలస్యంగా చెప్పడంతో తెలుగు ఆడియన్స్ షాక్తో పాటు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు, రమ్య నంబీశన్. మాలీవుడ్లో బాలనటిగా సినిమాలు చేసి, పెద్దయ్యాక తమిళ్, మలయాళంలోనూ నటించింది. విజయ్ సేతుపతి ‘పిజ్జా’ (తెలుగు డబ్బింగ్) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 2008లో ‘అందమైన మనసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘సారాయి వీర్రాజు’, ‘నువ్విలా’, ‘తెలుగబ్బాయి’ వంటి చిత్రాల్లో కనిపించింది. తెలుగులో యాక్ట్ చేసి 10 ఏళ్లకు పైనే అయింది. తనీష్ హీరోగా చేసిన ‘తెలుగబ్బాయి’ లో ఓ పాట కూడా పాడింది.
మలయాళం,తమిళ్ భాషల్లో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్గా జె.డి.చక్రవర్తి ‘దయ’ వెబ్ సిరీస్లో నటించింది. ప్రమోషన్స్లో భాగంగా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పింది. ‘పుష్ప – ది రైజ్’ లో మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడిన ‘ఊ అంటావా మావా’ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ పాట మలయాళం వెర్షన్ ‘ఊ చొల్లున్నో మావా’ రమ్య నంబీశన్ పాడింది. ఆమెకు సింగర్ క్రెడిట్ కూడా ఇచ్చారు. ఇక్కడిలానే అక్కడ కూడా ఓ ఊపు ఊపిందీ పాట. అయితే ఈ సాంగ్ నేనే పాడాను అని రమ్య చెప్పేవరకు చాలా మందికి తెలియదు. ‘యాక్టర్ కమ్ సింగర్.. వెరీ టాలెంటెడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : వైరల్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ పెళ్లి ఫోటో!..