అచ్చమైన తెలుగు అందం, హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లయ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విజయవాడ. వేణు హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లయ. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రేమించు సినిమాల్లో అంధురాలిగా నటించి.. అందరి చేత ప్రశంసలు పొందింది. అంతేకాక ఈ చిత్రంలో ఆమె నటనకు గాను నంది అవార్డు కూడా లభించింది. ర్వాత జగపతి బాబుతో నటించిన ‘మనోహరం’ సినిమాకు కూడా మరోసారి నంది అవార్డు అందుకుంది. ఇక హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉండగానే.. అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ శ్రీ గణేష్ను పెళ్లి చేసుకుని.. ప్రస్తుతం అక్కడే సెటిల్ అయ్యింది లయ.
సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు సినిమాలు చేసినా.. చేయకపోయినా.. అభిమానులకు మాత్రం కాంటాక్ట్లోనే ఉంటున్నారు. తమ గురించి, కుటుంబం గురించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. లయ కూడా సోషల్ మీడియాలో తన కుటుంబం, పిల్లలకు సంబంధించి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది లయ. ఆమెకు ఓ పాప, బాబు సంతానం. వీరిని రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అంతేకాక లయ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.
ఇక అమెరికాలో సెటిల్ అయినప్పటికి.. మన సాంప్రదాయం, ఆచారాలు, పండుగలను పాటించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయదు లయ. దసరా సందర్భంగా శరన్నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. తాజాగా దీపావళిని కూడా గ్రాండ్గా చేసుకుంది. భర్త, పిల్లతో కలిసి పూజలు చేసి.. టపాసులు కాల్చి.. పండుగను సెలబ్రేట్ చేసుకుంది లయ. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి వైరలువుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు.. లయ అందం ఏమాత్రం తగ్గలేదు.. ఇప్పుడు ఇంకా అందంగా, హుందాగా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు.