సాధారణంగా ఏ హీరో అయినా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథ నచ్చడమే. ఆ కథ హిట్ అవుతుంది అన్న నమ్మకమే అతడిని ఆ సినిమా చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇక కొంత మంది హీరోలు మాత్రం ఆ డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతోనో లేదా అతడి టాలెంట్ పై ఉన్న నమ్మకంతోనో సినిమాలు చేస్తారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మాత్రం.. తాజాగా చేసిన 18 పేజెస్ సినిమా కథ తెలీయకుండానే చేశాను అంటున్నాడు. కేవలం ఆ ఒకే ఒక్క కారణంతోనే ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చాడు. మరి ఆ కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
’18 పేజెస్‘ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లు హీరో, హీరోయిన్ గా కలిసి నటించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇందుకు సంబంధించి విజయోత్సవాలను సైతం చిత్ర బృందం నిర్వహించింది. తాజాగా చిత్ర విజయంతో మంచి జోష్ మీదున్న నిఖిల్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఇక చాట్ లో ఎక్కువ ప్రశ్నలు కార్తికేయ 2 గురించే అడగటం విశేషం.
ఈ క్రమంలోనే కార్తికేయ 2 అంతటి విజయాన్ని సాధిస్తుంది అని మీరు అనుకున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేనే కాదు ఎవరూ కూడా ఈ విజయాన్ని ఊహించలేదు. ఐతే కష్టపడటం వరకే మన పని.. ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక 18 పేజెస్ సినిమా కథ ఏంటి? ఈ సినిమాని ఒప్పుకోవడానికి కారణాలు ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఆన్సర్ ఇచ్చాడు. మీకు తెలియని విషయం ఏంటంటే? అసలు ఈ సినిమా కథ ఏంటో కూడా నాకు తెలీదు. కేవలం గీతాఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పేర్లను చూసే ఈ సినిమా ఒప్పుకున్నాను. అయితే నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అని ప్రేక్షకులు ఈ విజయం ద్వారా నిరూపించారు. మరికొన్ని ప్రశ్నలకు కూడా ఆన్సర్ చెప్పుకొచ్చాడు నిఖిల్.
Never Expected to be a Movie Actor Either… But God and Destiny have a plan 🙏🏽 and I am very happy with Working Hard and leaving the rest to The Audience 🙏🏽 #AskNikhil https://t.co/BBYuaoaSlA
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 26, 2022