ప్రపంచలో అనేక నదుల గుండా అత్యంత ఎక్కువగా దూరం ప్రయాణించే పొడవైన, విలాసవంతమైన నౌక ఎంవి గంగా విలాస్ ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఆరంభించారు. తొలుత ఈ క్రూయిజ్ లో 32 మంది స్విస్ పర్యాటకులు ప్రయాణిస్తారు. వీరంతా వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ కు చేరుకుంటారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రివర్ క్రూయిజ్ ను రూపొందించారు. మరి ఈ ఇండియన్ టైటానిక్ ఎన్ని నదుల గుండా పోతుంది? దీని టికెట్ ధర ఎంత? ఏమేమీ సదుపాయాలుంటాయో తెలుసుకుందామా..
గంగా విలాస్ భారత్, బంగ్లా దేశ్ లలో 27 నదుల గుండా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. భారత్ లోని బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అసోంలతో పాటు బంగ్లాదేశ్ లోని నదుల్లో ఈ భారీ నౌక ప్రయాణిస్తుంది. భారత్ లోని ప్రధాన నదులైన గంగ, బ్రహ్మపుత్ర, బాగీరథీ, హుబ్లీ, విద్యావతి, మాట్లా, బంగ్లాదేశ్ లోని మేఘన, పద్మ, జమున నదుల్లో విహరిస్తుంది. 51 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను చుట్టి రావచ్చు. 36 మంది పర్యాటకుల ఉండేందుకు వీలుగా 18 సూటు గదులు ఏర్పాటు చేశారు. స్పా, జిమ్ సెంటర్ల వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ నౌకలో ఉండటం విశేషం.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుండి ఈ పర్యటన ప్రారంభమౌతుంది. వారసత్వ ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు, నదీ ఘాట్ ల గుండా ఈ నౌక ప్రయాణిస్తుంది. బీహార్ లోని పాట్నా, జార్ఖండ్ లోని షాహిగంజ్, బెంగాల్ లోని కోల్ కతా, అసోంలోని గువహటి, బంగ్లాదేశ్ లోని ఢాకా వంటి నగరాలు ఆ జాబితాలో ఉన్నాయి. వారణాసిలోని గంగా హారతి, బౌద్ధమతానికి కీలకమైన తారానాథ్, ప్రపంచ అతిపెద్ద నదీ ద్వీపం మజులీ, బీహార్ లోని విక్రమ శీల యూనివర్శిటీ, బెంగాల్ టైగర్స్ నెలవైన సుందర్భన్ అడవులు, ఖడ్గ మృగాలైన ప్రసిద్ధమైన అసోంలోని ఖజరంగ నేషనల్ పార్క్ ను ఈ పర్యటనలో తిలకించవచ్చు.
ఈ లగ్జరీ నౌకలో ప్రయాణించాలంటే.. ఒక్కొక్క ప్రయాణికుడు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా.. చెబితే నోరు వెళ్లబెట్టాల్సిందే. 51 రోజుల ప్రయాణానికిగానూ ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు అవుతుందని ఈ క్రూయిజ్ డైరెక్టర్ రాజ్ సింగ్ తెలిపారు. ఇందులో కేవలం జిమ్, స్పా వంటి సౌకర్యాలకు రోజుకు రూ. 25 నుండి 50 వేలు చెల్లించాలట. ఈ నౌకలో మరో స్పెషాలిటీ ఏంటంటే.. కాలుష్య రహిత వ్యవస్థ, శబ్ద కాలుష్య నియంత్రణ టెక్నాలజీ ఉన్నాయి. అదేవిధంగా స్నానం, ఇతర అసవరాలకు గంగా జలాన్ని శుద్ది చేసే ఫ్లాంట్ ఇందులో అమర్చామని డైరెక్టర్ చెప్పారు. ఈ లగ్జరీ క్రూయిజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి.
River cruise liner MV Ganga Vilas sets sail from UP’s Varanasi, to cover a distance of around 3200km, to reach Dibrugarh in Assam pic.twitter.com/BLst4V7Jyt
— ANI (@ANI) January 13, 2023
India is set to gain a huge boost in inland water transportation by launching the world’s #LongestRiverCruise, named MV Ganga Vilas. It will sail from Varanasi to Dibrugarh via Bangladesh across 27 river systems and take 51 days. pic.twitter.com/MWDhVk2qNm
— Nitin Gadkari (@nitin_gadkari) January 11, 2023