దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకి సువర్ణావకాశం ఇస్తుంది. 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన బీసీఏ(BCA), బీఎస్సీ(BSC) పూర్తి చేసిన యువకుల నుంచి దరఖాస్తులని ఆహ్వానిస్తుంది. విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2022 (WILP) ద్వారా ఈ అవకాశం కల్పిస్తుంది. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నత చదువులు చదువుకోవచ్చునని విప్రో కంపెనీ తెలిపింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బీసీఏ, బీఎస్సీ పూర్తి చేసిన యువకులు ఉద్యోగం చేసుకుంటూ.. దేశంలోని ప్రముఖ విశ్వ విద్యాలయంలో ఎంటెక్ చేసే అవకాశాన్ని విప్రో కల్పిస్తుంది. అంతేకాదు విప్రోనే స్వయంగా డిగ్రీని స్పాన్సర్ చేస్తానంటుంది.
10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉతీర్ణులై ఉండాలి. యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం డిగ్రీలో 60 శాతం లేదా 6.0 సిజిపిఎ మరియు అంతకంటే ఎక్కువ మార్కులు కలిగి ఉండాలి. 2021, 2022 సంవత్సరాల్లో పాసై ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్(బీసీఏ) చేసి ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేసి ఉండాలి. డిగ్రీలో ఖచ్చితంగా కోర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి. బిజినెస్ మ్యాథ్స్ అండ్ అప్లైడ్ మ్యాథ్స్ కోర్ మ్యాథమెటిక్స్గా పరిగణలోకి తీసుకోరు. టెన్త్కి, డిగ్రీకి మధ్య 3 ఏళ్ల గ్యాప్ ఉంటే అనుమతి ఉంటుంది. అయితే డిగ్రీలో మాత్రం గ్యాప్ ఉండకూడదు.
3 ఏళ్ల లోపు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 10, 12వ తరగతులు పూర్తి చేసి ఉండాలి. అది కూడా రెగ్యులర్ ఫుల్ టైంలో పూర్తి చేసి ఉండాలి. ఇక ఇంటర్వ్యూ సమయానికి ఒక బ్యాక్లాగ్ మాత్రమే అనుమతిస్తుంది. అన్ని బ్యాక్లాగ్లు క్లియర్ చేసుకునే దాని బట్టి కంపెనీ ఆఫర్లు లోబడి ఉంటాయి. భారతీయ పౌరులు అయి ఉండాలి. ఇతర దేశాలకు చెందిన పాస్పోర్ట్ ఉంటే.. పిఐఓ, ఓసిఐ కార్డ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. నేపాల్, భూటాన్కి చెందిన వారైతే సిటిజన్షిప్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అయితే గడిచిన మూడు నెలల్లో ఎవరైతే విప్రో కంపెనీ కండక్ట్ చేసిన సెలెక్షన్ ప్రక్రియలో పాల్గొన్నారో వారు అనర్హులుగా కంపెనీ తెలిపింది.
వన్ టైం జాయినింగ్ బోనస్గా 75 వేలు కంపెనీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ హోదా ఇస్తుంది. పెర్ఫార్మెన్స్ బట్టి ఏడాదికి 6 లక్షల నుండి ప్యాకేజ్ ఇస్తుంది.
WILP ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఫుల్ టైం ఉద్యోగులుగా రిక్రూట్ అయిన వారికి మాత్రమే పెర్ఫార్మెన్స్ బోనస్లు ఉంటాయి.
5 సంవత్సరాలు పని చేస్తామని చెప్పి జాయినింగ్ రోజున సర్వీస్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలని కంపెనీ తెలిపింది. 2022 సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి 11.59 వరకూ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2022కి దరఖాస్తు చేసుకోవడానికి డెడ్లైన్ ఉంది. మరి అర్హత, ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి. మరి యువతకు సువర్ణావకాశం కల్పిస్తున్న విప్రో కంపెనీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి