ప్రస్తుతం దేశంలో ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకోవాలంటే.. ఎలాంటి కాంపిటీషన్ ఎదుర్కొవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందులు పడేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పేద విద్యార్థులు కోసం ఈ మద్య కొన్ని కంపెనీలు స్కాలర్ షిప్ అందిస్తూ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసొందే. మంచి ప్రతిభ కలిగి ఉండి.. ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆశయం ఉన్నప్పటికీ.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనివారి కోసం పానసోనిక్ ఒక శుభవార్త తెలిపింది. ఉన్నత విద్యనభ్యసించడానికి పేదరికం అడ్డు రావొద్దనే ఉద్దేశ్యంతో విద్యార్థులకు ట్యూషన్ ఫీజ్ చెల్లించేందుకు పానసోనిక్ రట్టి స్టూడెంట్ స్కాలర్షిప్ (Panasonic Ratti Chhatr Scholarship)పేరిట ఆ కంపెనీ ముందుకు రాబోతుంది. ఐఐటీ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ప్రత్యేకంగా అందిస్తున్నామని తెలిపారు.
ఈ స్కాలర్ షిప్ అందుకునే అభ్యర్థులు ఏదైనా కళాశాలలో ఐఐటీ లో బీఈ, బీటెక్ కోర్సులు చదువుతూ ఉండాలి. అంతేకాదు ఇంటర్ పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూసేవారైనా ఇందుకు అర్హులవుతారు. కాకపోతే ఇంటర్ లో తప్పనిసరిగా 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇక దరఖాస్తు చేసుకుబోయే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉండాలి.. అంతకు మించితే అనర్హులు అని తెలిపింది. విద్యార్థు తప్పనిసరి భారతీయుడైన ఉండాలి.. ఈ దరఖాస్తు 2022-03 బ్యార్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వారు తెలిపారు. ఇక అన్ని అర్హతలు ఉండి ఎంపికపైన విద్యార్థులకు పానసోనిక్ వారు ప్రతి సంవత్సరం రూ.42,500 చొప్పున 4 సంవత్సరాల పాటు స్కాలర్ షిప్ అందించేందుకు రెడీ అయ్యింది.