భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశవ్యాప్తంగా ఏఏఐ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎయిర్పోర్టుల సమర్థ నిర్వహణకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలు ఎంతో కీలకం. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తూ సురక్షిత ప్రయాణాలు సాగేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అర్హతలు ఏంటి..? జీతాభత్యాలు ఎలా ఉంటాయి..? వంటి పూర్తి వివరాలు మీకోసం..
విభాగాలు:
అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి .
వయసు: 21.01.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతభత్యాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 నుండి రూ.140,000 వరకు జీతం చెల్లిస్తారు.
ఎంపిక పక్రియ: గేట్ 2020/ గేట్ 2021/ గేట్ 2022 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు