చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్ మ్యాచ్కు ముందు ఒక విషయంలో గుజరాత్ టైటాన్స్ తెగ భయపడిపోతోంది. సీఎస్కే జట్టులోని ఒక ప్లేయర్ అంటే హార్దిక్ సేన వణుకుతోంది. దీనికి ఆ జట్టుపై అతడి ట్రాక్ రికార్డే కారణం.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి పోస్ట్పోన్ అయింది. ఫైనల్కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్లో వాతావరణాన్ని చూస్తుంటే రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్ జరగడం కాస్త అనుమానంగానే ఉంది. అయితే ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా.. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అంటే మాత్రం గుజరాత్ టైటాన్స్కు వెన్నులో వణుకు పుడుతోంది. అతడ్ని చూస్తేనే హార్దిక్ సేన భయపడిపోతోంది. అందుకు కారణం ఆ జట్టుపై అతడికి ఉన్న అద్భుతమైన రికార్డే. గత రెండు సీజన్లలో కలిపి గుజరాత్ టైటాన్స్తో ఆడిన 4 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు బాదాడు రుతురాజ్. క్వాలిఫయర్-1లో ఆ జట్టుపై 44 బాల్స్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 60 రన్స్ చేశాడు.
ఈ లీగ్ ఆరంభ మ్యాచ్లోనూ హార్దిక్ సేనపై విజృంభించి ఆడాడు రుతురాజ్ గైక్వాడ్. ఆ మ్యాచ్లో 50 బాల్స్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 రన్స్ చేశాడు. తృటిలో సెంచరీ చేసే ఛాన్స్ను కోల్పోయాడు రుతురాజ్. మొత్తంగా గుజరాత్ టీమ్పై ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో రుతురాజ్ 278 రన్స్ స్కోర్ చేశాడు. ఐపీఎల్లో మరే ప్లేయర్ కూడా టైటాన్స్ మీద ఇన్ని రన్స్ చేయలేదు. గైక్వాడ్ తర్వాత ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గుజరాత్పై 232 రన్స్ చేశాడు. ఈ రికార్డులు గుజరాత్ బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకవేళ పూర్తి ఓవర్లు మ్యాచ్ జరగడం సాధ్యమైతే, రుతురాజ్ను వీలైనంత త్వరగా పెవిలియన్కు చేర్చాలని ప్రత్యర్థి బౌలర్లు వ్యూహాలు పన్నుతున్నారు. మరి.. రుతురాజ్ బ్యాటింగ్ తుఫాన్ను గుజరాత్ బౌలర్లు అడ్డుకోగలరని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.