ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచు జరుగుతున్న సంగతి తెలిసిందే. గిల్ సెంచరీతో హైలెట్ గా నిలవగా ..ఈ ఇన్నింగ్స్ లో సన్ రైజర్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
ఐపీఎల్ 2023లో భాగంగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచు జరుగుతున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో(101)చెలరేగి ఆడగా.. సాయి సుదర్శన్(47) చక్కని సహకారం అందించాడు. గిల్ సెంచరీతో హైలెట్ గా నిలవగా ..ఈ ఇన్నింగ్స్ లో సన్ రైజర్స్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
గుజరాత్ బ్యాటర్లు ఈ మ్యాచులో చెలరేగి ఆడినా.. సన్ రైజర్స్ బౌలర్లు చివర్లో ఆకట్టుకున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి 147 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ ఈజీగా 220 పరుగులు సాధిస్తుందని భావించారంతా. అయితే చివర్లో హైదరాబాద్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేసి చివరి 6 ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఇక ఈ ఇన్నింగ్స్ లో 20 ఓవర్లో సన్ రైజర్స్ కి నాలుగు వికెట్లు లభించాయి. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో మొదటి మూడు బంతులకి అలాగే 5 వ బంతికి వికెట్లు వచ్చాయి. తొలి మూడు బంతుల్లో వికెట్లు లభించినప్పటికీ మూడో బంతి రనౌత్ రూపంలో రావడంతో భువికి హ్యాట్రిక్ మిస్ అయింది. ఈ మ్యాచులో భువనేశ్వర్ నాలుగు ఓవర్లో 30 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. మరి ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడడం లాంటి అరుదైన సంఘటన మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
4-0-30-5.
BHUBANESWAR KUMAR IS BACK. You just can’t scroll down without liking this!! ❤️ pic.twitter.com/pkvuV06fEl
— Sexy Cricket Shots (@sexycricketshot) May 15, 2023