ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ పై ఈ ఆరోపణలు వస్తున్నాయి. బీసీసీఐ దృష్టి కూడా అతడిపై పడింది. ఇంతకీ ఏంటి సంగతి?
క్రికెట్ మ్యాచుల్లో పలువురు ఆటగాళ్లు ఫిక్సింగ్ చేయడం, దొరికిపోవడం లాంటివి మనకు కొత్తేం కాదు. ఎప్పటినుంచి ఉన్నదే ఇది! నిజంగా చేసి ఉండొచ్చు, లేదా ఆరోపణలు ఫేస్ చేస్తున్న వారిలో సాధారణ ఆటగాళ్ల నుంచి స్టార్ క్రికెటర్ల వరకు చాలామందే ఉన్నారు. ఈ ఫిక్సింగ్ లో ఇరుక్కుని కెరీర్ నాశనం చేసుకున్న లిస్ట్ తీస్తే చాలా పెద్దది ఉంటుంది. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పై అలాంటి ఆరోపణలే వస్తున్నాయి. దీనంతటికీ కారణం తాజాగా జరిగిన ఓ మ్యాచ్ అని తెలుస్తోంది. ఇంతకీ ఆ మ్యాచులో ఏం జరిగింది?
అసలు విషయానికొస్తే.. ఈసారి ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడలేని డౌట్స్ అన్నీ వస్తున్నాయి. సరిగా ఓ వారం-పది రోజుల క్రితం ‘ఐపీఎల్ లో మ్యాచులు 80 శాతం స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయి’ అని ఆడమ్ గిల్ క్రిస్ట్ అన్నట్లు ఓ న్యూస్ వచ్చింది. ఇందులో నిజానిజాలు పెద్దగా తెలియదుగానీ.. గతవారం రోజుల్లో జరిగిన మ్యాచుల్ని తీసుకుంటే.. దాదాపు ప్రతిదీ కూడా చివరి ఓవర్ సాగుతోంది. ఛేజ్ చేసిన టీమ్స్ దాదాపు గెలుస్తున్నాయి. కానీ తాజాగా గుజరాత్ పై మాత్రం లక్నో జట్టు చాలా అంటే చాలా అనుమానస్పదంగా ఓడిపోయింది. దీంతో కేఎల్ రాహుల్ పై బీసీసీఐ కన్ను పడినట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచులో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసి 135/6 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఛేదనలో లక్నో బ్యాటింగ్ చూస్తే ఈ జట్టు గెలవడం పక్కా అని ఫిక్సయిపోయారు. అందుకు తగ్గట్లే గెలవడానికి 5 ఓవర్లలో 30 రన్స్ కొట్టాలి. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. ఈ టైంలో ఎంత ఎడాపెడా ఆడినా సరే గెలిచేయొచ్చు కానీ లక్నో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్నో కెప్టెన్ రాహుల్ అయితే మరీ దారుణంగా టెస్టులా జిడ్డు బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ గా వచ్చి చివరి ఓవర్ రెండో బంతి వరకు ఆడాడు. కానీ సొంత జట్టుని గెలిపించలేదు. ఇదంతా చూస్తుంటే.. ఏదో కావాలని ఓడిపోయినట్లు అనిపిస్తుంది.
ఎందుకంటే లక్నో జట్టులో కేఎల్ రాహుల్ ఫెయిలయ్యాడంటే సరే చాలా కాలం నుంచి ఇలానే ఆడుతున్నాడు అనుకుందాం. కానీ కైల్ మేయర్స్, కృనాల్ పాండ్య, పూరన్, స్టోయినిస్, దీపక్ హుడా.. ఇలా అందరూ ఆడే ప్లేయర్స్. వీళ్లందరూ కూడా ఏదో వచ్చాం, జిడ్డు బ్యాటింగ్ ఆడాం. ఔటై వెళ్లిపోయామా అన్నట్లు ఆడారు తప్పితే ఒక్కరూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇవన్నీ చూస్తున్న చాలామంది నెటిజన్స్.. మ్యాచ్ ఫిక్స్ అయింది అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. దీనంతటికీ ప్రధాన కారకుడు కేఎల్ రాహుల్ అని, అతడిపై విచారణ జరపాలని పలువురు క్రికెట్ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. మరి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
30 runs were needed in last 36 ball but LSG lost by 7 runs 😳😳🤯
What have you done Kl Rahul.
— BALA (@erbmjha) April 22, 2023