ఐపీఎల్ 2022లో శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక వివాదం చెలరేగింది. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమైన దశలో మెకాయ్ బౌలింగ్లో తొలి రెండు బంతులను ఢిల్లీ ఆల్రౌండర్ పావెల్ సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతిని మెకాయ్ ఫుల్ టాస్గా వేశాడు. ఆ బంతి పావెల్ నడుము పై భాగం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చింది. దాన్ని కూడా పావెల్ సిక్స్ కొట్టాడు. కానీ అంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటించకుండా.. ఫెయిర్ డెలవరీగానే గుర్తించాడు.
కానీ డగౌట్ నుంచి ఢిల్లీ ఆటగాళ్లు అది నోబాల్ అంటూ సైగలు చేస్తూ.. తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. పావెల్ కూడా అంపైర్ వద్దకు వెళ్లి మరీ నోబాల్పై వాడించాడు. అయినా కూడా అంపైర్ నితిన్ మీనన్ దాన్ని నోబాల్గా ప్రకటించలేదు. దీంతో పంత్ తమ బ్యాటర్లను వెనక్కు వచ్చేయాల్సిందిగా చెప్పాడు. కానీ.. ఢిల్లీ బ్యాటింగ్ కోచ్ వాట్సన్ సర్దిచెప్పడంతో పావెల్, కుల్దీప్ బ్యాటింగ్ కొనసాగించారు. అయినా కూడా పంత్ తమ జట్టు సభ్యుడిని ఒకరిని గ్రౌండ్లోకి పంపించాడు.దీంతో ఢిల్లీ డగౌట్ దగ్గర్లో ఫీల్డింగ్ చేస్తున్న బట్లర్ కలగచేసుకోని.. ఇది సరైన పద్దతి కాదని పంత్తో వాదనకు దిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పంత్, బట్లర్ మధ్య వాదన చోటు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చివరికి అంతా సర్దుమణిగి.. మూడు బంతుల్లో 18 పరుగులు చేసేందుకు పావెల్ సిద్ధమయ్యాడు. కానీ.. మెకాయ్ చివరి మూడో బంతులను బాగా బౌలింగ్ చేశాడు. దీంతో రాజస్థాన్ 15 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ గెలిచింది. మరి పంత్, బట్లర్ మధ్య గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పంత్ పిలుపుతో గ్రౌండ్ బయటికి వెళ్లేందుకు సిద్ధమైన కుల్దీప్పై చాహల్ రౌడీయిజం!
Crazy 🤯🤯🤯 pic.twitter.com/JCcWZd9Tg6
— Sehwag (@Sehwag54587220) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.