ఐపీఎల్ 2022 సూపర్ ఫామ్తో డెత్ ఓవర్స్లో దంచికొడుతున్న దినేష్ కార్తీక్.. లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను తానే దూషించుకుంటూ.. బ్యాట్తో తలపై కొట్టుకునేంత కోపంలో కనిపించాడు. అందుకు కారణం రెండు బాల్స్ డాట్ కావడమే. కేవలం రెండు బాల్స్ మిస్ అయితే ఇంతలా ఫీల్ అవ్వాలా అని మీరు అనుకోవచ్చు. కానీ.. బుధవారం కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ చూసి ఉంటే మాత్రం డీకే కోపాన్ని అర్థం చేసుకోచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ డుప్లెసిస్ వికెట్ను కోల్పోయింది. పవర్ప్లే ముగిసిన తర్వాత బాగా ఆడుతున్నాడు అనుకునే లోపలే కోహ్లీ కూడా 25 పరుగులు చేసి భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత విధ్వంసకర బ్యాటర్ మ్యాక్స్వెల్ సైతం పెవిలియన్ చేరాడు. ఒక ఎండ్లో కొత్త కుర్రాడు రజత్ పటీదార్ ధాటిగా ఆడుతున్నా.. మరో ఎండ్లో వికెట్లు పడుతుండడంతో ఆర్సీబీకి కష్టాలు వచ్చాయి. మ్యాక్సీ స్థానంలో వచ్చిన లోమ్రోర్ కూడా రెండు మంచి షాట్లు ఆడి అవుట్ అయ్యాడు. ఈ దశలో ఎన్నో అంచనాల మధ్య క్రీజ్లోకి వచ్చిన దినేష్ కార్తీక్.. రజత్కు జోడీ కట్టాడు. ఇద్దరు 15వ ఇన్నింగ్స్ నుంచి బ్యాట్ ఝుళిపించారు. దీంతో స్కోర్ బోర్డు గుర్రపుస్వారీ చేసింది. ఈ క్రమంలోనే పటీదార్ సెంచరీ చేశాడు. ఇక చివరి ఓవర్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించారు. స్ట్రైక్లో డీకే ఉండడంతో.. పరుగుల వరద ఖాయం అనుకున్నారు. కానీ.. ఆవేశ్ ఖాన్ డీకేకు అంత ఈజీగా లొంగలేదు. తొలి బంతికి కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. రెండు బంతిని కార్తీక్ అద్భుతంగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత ఆవేశ్ ఖాన్ తన తెలివిని ప్రదర్శించి.. కార్తీక్ను రెండు డాట్స్ బాల్స్ వేశాడు.ఈ సీజన్లోనే అత్యధిక స్ట్రైక్ రేట్తో ఆడుతున్న బ్యాటర్కు, అందులోనే చివరి ఓవర్లో రెండు బాల్స్ అంటే మామూలు విషయం కాదు. అందుకే కార్తీక్.. ఆ రెండు బాల్స్ విలువ తెలిసిన వాడు కనుకనే అంతలా రియాక్ట్ అయ్యాడు. బాల్స్ మిస్ చేసుకున్నందుకు తనను తానే తిట్టుకున్నాడు. ప్రస్తుతం కార్తీక్ బాల్స్ మిస్ చేసుకున్నందుకు ఇచ్చిన రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. మొహ్సిన్ ఖాన్ ఆర్సీబీని తొలి ఓవర్లోనే దారుణంగా దెబ్బతిశాడు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్(0)ను తొలి ఓవర్ ఐదో బంతికి అవుట్ చేసి.. టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకున్న తన కెప్టెన్ నిర్ణయం సరైందే అని నిరూపించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ ఇన్సింగ్స్ను కొనసాగించాడు. కోహ్లీ నెమ్మదిగానే ఆడినా.. పటీదార్ మాత్రం ఎటాకింగ్ ప్లేతో లక్నో బౌలర్లకు చూక్కలు చూపించాడు. పటీదార్ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు. దినేష్ కార్తీక్ 23 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్ 37 పరుగులు చేసి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు. 208 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నోను ఆర్సీబీ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే దెబ్బకొట్టాడు. సూపర్ ఫామ్లో ఉన్న క్వింటన్ డికాక్(6)ను తొలి ఓవర్లోనే అవుట్ చేశాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు, దీపక్ హుడా 26 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించారు కానీ.. లక్నోకు విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు 193 పరుగులు చేసి 14 రన్స్ తేడాతో ఓడింది. ఆర్సీబీ బౌలర్లలో హెజల్వుట్ 3, సిరాజ్, హసరంగా, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. మరి రెండు బాల్స్ మిస్ చేసుకున్నందుకు కార్తీక్ ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Gautam Gambhir: ఊహించని ఓటమితో సహనం కోల్పోయిన గంభీర్! కేఎల్ రాహుల్ను పొట్టుపొట్టు తిట్టాడు
— pant shirt fc (@shirt_fc) May 25, 2022