వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై చాలా ఏళ్లే అవుతుంది. రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. అందరి పెళ్లిళ్లు జరిగిపోవడంతో ఈ ముసలి దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. ఇక ఉన్నట్టుండి మహిళ మరణించింది. తల్లి మరణవార్త తెలుసుకున్న ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తన తల్లి శవపేటికతో ఓ ఇంటికి ముందు కూతుళ్లు నిరసనకు దిగారు. అసలు శవపేటికతో ఆ మహిళ కూతుళ్లు ఎందుకు నిరసన దిగారు? దాని వెనకాల ఉన్న బలమైన కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని నాగులకట్ట. ఇదే ప్రాంతంలో అనుపూరు కుళ్లాయప్ప, హూసేనమ్మ (65) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ దంపతులు పైసా పైసా కూడబెట్టి ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. జీవితంలో చేయాల్సిన ప్రధాన ఘట్టలు జరిగిపోవడంతో ఆ దంపతులు సంతోషంగా ఉన్నారు. అలా వీరి కాపురం ఆనందంగా సాగుతున్న క్రమంలోనే కుళ్లాయప్ప దూరపు బంధువైన పెద్ద కుళ్లాయప్ప అనే వ్యక్తికి విడతలవారిగా రూ.50 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2019లో హూసేనమ్మ భర్త కుళ్లాయప్ప మరణించాడు.
ఇక కొన్నిరోజులు గడిచాక పెద్ద కుళ్లాయప్ప తీసుకున్న సొమ్మును ఇవ్వాలంటూ హూసేనమ్మ అనేక సార్లు పెద్ద కుళ్లాయప్పను అడిగింది. అయినా లెక్కచేయని పెద్ద కుళ్లాయప్ప అడిగినా ప్రతీసారి ఈ రోజంటూ, రేపు అంటూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. ఇక ఇటీవల అనారోగ్య కారణంతో హూసేనమ్మ కూడా మరణించింది. తల్లి మరణవార్త తెలుసుకున్న ఆమె ముగ్గురు కూతుళ్ల కన్నీరు మున్నీరుగా విలపించారు. దూరపు బంధువు తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా ఉండడంతో మనస్థాపం చేందే మా అమ్మ మరణించిందని ఆ మహిళ కూతుళ్లు వాపోయారు.
పెద్ద కుళ్లాయప్ప తీసుకున్న డబ్బును ఇచ్చేంత వరకూ మా తల్లి శవాన్ని పూడ్చిపెట్టే ప్రసక్తే లేదంటూ హూసేనమ్మ కూతుళ్లు ఆమె శవపేటికతో పెద్ద కుళ్లాయప్ప ఇంటి ముందు నిరసనకు దిగారు. ఇక బంధువులు కలగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. దీంతో శుక్రవారం లోగ కొంత సొమ్మును ఇస్తానని పెద్ద కుళ్లాయప్ప హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి హూసేనమ్మ శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.