ఈ రోజుల్లో పెళ్లైన చాలా మంది మహిళలు భర్తను కాదని మరొక మగాడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. చివరికి ఇది బయటపడడంతో హత్యలు చేయడమో, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ మహిళ ఒకరిని కాదు ఏకంగా ఇద్దరి ప్రియుళ్లను మెయింటెన్స్ చేస్తూ వచ్చింది. ఎన్నో ట్విస్టుల మధ్య సాగిన ఈ స్టోరీలో తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు కడలూరు జిల్లా తట్టంజవాడి పరిధిలోని గాంధీనగర్ లో శక్తివేల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలోనే శక్తివేల్ కు పన్రూటిలో గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ ఆటో డ్రైవర్లే కావడంతో మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇదిలా ఉంటే గాంధీనగర్ లోనే భూమిక అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లై భర్త గతంలోనే మరణించడంతో ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే శక్తివేల్ కు భూమిక పరిచయం అయింది. ఈ పరిచయమే చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అలా కొంత కాలం పాటు వీరి అక్రమ సంబంధం ఘనంగా వర్ధిల్లితున్న క్రమంలోనే భూమికకు శక్తివేల్ స్నేహితుడైన సుమన్ పరిచయమయ్యాడు. దీంతో భూమిక ఇతనితో కూడా తెర వెనుకు అక్రమ సంబంధానికి పావులు కదిపింది. సుమన్ తో ప్రేమాయణాన్ని భూమిక శక్తివేల్ కు తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. అలా కొన్నాళ్లకి సుమన్ భూమికతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని శక్తివేల్ కు తెలిసిపోయింది. దీంతో శక్తివల్, సుమన్ ఇద్దరు భూమిక కోసం అనేక సార్లు గొడవపడ్డారు. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి సుమన్, శక్తివేల్ మందు పార్టీ చేసుకున్నారు.
ఇద్దరు మత్తులోకి జారుకున్నాక సుమన్ శక్తివేల్ తో వాదనకు దిగాడు. నువ్వు భూమికను వదిలేయాని అన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన శక్తివేల్ నేనేంటి వదిలేసిది.., నువ్వే భూమికను వదిలేయాని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిపోయింది. కోపంతో ఊగిపోయిన సుమన్ శక్తివేల్ ను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు అయిన సుమన్ ను అరెస్ట్ చేశారు. ఓ ప్రియుడు మరణించడం, మరో ప్రియుడు జైలుకు వెళ్లడంతో ప్రియురాలు భూమిక తట్టుకోలేకపోయింది.
అనేక ఒత్తిళ్ల నడుమ భూమిక పురుగుల మందు తాగి విల్లుపురంలోని బస్టాండ్ వద్ద కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇదే విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నపోలీసుల విచారించగా.., భూమిక చనిపోయిన శక్తివేల్ ను, జైలుకు వెళ్లిన సుమన్ లతో వివాహేతర సంబంధం పెట్టుకుందని తేలింది. ఓప్రియుడు మరణించడం, మరో ప్రియుడు జైలుకు వెళ్లడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఎన్నో ట్విస్ట్ లతో ముగిసిన ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.