Hyderabad Crime: ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మెట్రో స్టేషన్పైకి ఎక్కి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. బోరబండ, శ్రీరాం నగర్ సమీపంలోని సంజయ్ నగర్కు చెందిన అన్వర్ ఖాన్ దంపతుల కూతురు షబానా. ఆమె షాదన్ కాలేజ్లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది.
తన ప్రేమ విఫలం అవ్వటంతో మంగళవారం సాయంత్రం ఈఎస్ఐ మెట్రో స్టేషన్కు చేరుకుంది. స్టేషన్పైకి ఎక్కి కిందకు దూకింది. దీంతో తీవ్రగాయాల పాలైన ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షబానా మృతి చెందింది. షబానా మెట్రో స్టేషన్పై నుంచి కిందకు దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇవి కూడా చదవండి : పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. రక్తంతో ‘ఐ లవ్యూ దీపక్’ అంటూ నోట్ రాసి..