Crime News: నేటి సమాజంలో టీవీ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రతీ ఇంట్లో టీవీ తప్పని సరిగా ఉండాలని కుటుంసభ్యులు భావిస్తున్నారు. అయితే, అదే టీవీ కుటుంబంలో కలహాలకు దారి తీస్తోంది. టీవీ విషయంలో గొడవల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు గతంలో చాలా జరిగాయి. తాజాగా, ఓ కోడలు టీవీ విషయంలో చోటుచేసుకున్న గొడవలో అత్తపై దాడి చేసింది. అత్త చేతి వేళ్లను కొరికిపడేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్ర, థానే జిల్లాలోని అంబర నాథ్ టౌన్కు చెందిన కులకర్ణి ఫ్యామిలీ అక్కడి వాడావలి ఖండ్లో నివాసం ఉంటోంది.
సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో 60 ఏళ్ల వృషాలి కులకర్ణి దేవుడి గదిలో పూజ చేస్తూ.. మంత్రాలు చదవసాగింది. అదే సమయంలో ఆమె కోడలు విజయ కులకర్ణి హాల్లో సినిమా చూస్తూ ఉంది. టీవీ సౌండ్ కారణంగా వృషాలి పూజకు కాస్త ఆటంకం ఏర్పడింది. దీంతో కోడల్ని టీవీ సౌండ్ తగ్గించమని అడిగింది. కోడలు అది పట్టించుకోలేదు. దీంతో అత్త పదేపదే అడగసాగింది. ఈ నేపథ్యంలోనే కోడలికి కోపం వచ్చింది. సౌండ్ ఎక్కువ చేసింది. అత్త వెంటనే హాలులోకి వచ్చి టీవీ ఆఫ్ చేసింది. అత్త టీవీ ఆఫ్ చేయటంతో కోడలికి కోపం వచ్చింది. ఆమెపై గొడవకు దిగింది. ఇద్దరూ బూతులు తిట్టుకున్నారు.
నా ఇళ్లు అంటే.. నా ఇళ్లు అని తిట్టుకున్నారు. అత్త చేతులు గాల్లో ఊపుతూ తనను తిట్టటంతో కోడలు ఆగ్రహం పట్టలేకపోయింది. అత్తపై దాడికి దిగింది. ఆమె కుడి చేతి వేళ్లను మూడింటిని కొరికిపడేసింది. తెగిన వేళ్లనుంచి రక్తం ధారాపాతంగా కారసాగింది. ఇంతలో విజయ భర్త అక్కడికి వచ్చాడు. తల్లి, భార్య మధ్య గొడవను ఆపుదామని చూశాడు. కానీ, విజయ భర్తపైనే దాడికి దిగి కొట్టింది. గొడవ ఆగిన తర్వాత అత్త వృషాలి పోలీస్ స్టేషన్కు వెళ్లింది. కోడలిపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: పోలీస్ స్టేషన్ లో యువకుడి రచ్చ.. నాలుగు పీకి కూర్చోబెట్టిన మహిళా కానిస్టేబుల్..