ఈ మద్య మనుషుల్లో మానవత్వం పూర్తిగా నశించిపోయే విధంగా కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. వేద మంత్రాల సాక్షిగా.. పెద్దలు, బంధు మిత్రుల దీవెనలతో ఒక్కటైన జంటలు ఏడాది గడవక ముందే చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలతో ఏకంగా ఒకరినొకరు చంపుకునే స్థాయికి దిగజారుతున్నారు. భార్య చేసిన మోసం వల్ల.. ఆడజాతినే సమూలంగా అంతం చేయాలని ద్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి ఉన్మాదిలా వరుస హత్యలకు పాల్పపడ్డాడు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఎట్టకేలకు సైకో కిల్లర్ ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అనకాపల్లి లో ధర్మసాగరం గ్రామానికి చెందిన చందక రాంబాబు కి 18 ఏళ్ల వయస్సులో రాజమండ్రికి చెందిన ఓ యువతితో పెళ్లి జరిగింది. బతుకుదెరువు కోసం రాంబాబు తాపీ మేస్త్రీగా, ఆటో రిక్షా డ్రైవర్గా పనిచేసిన అతడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. 2018లో హైదరాబాద్ లో రాంబాబు భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరూ విడిపోయారు.
రియలెస్టేట్ వ్యాపారి కమీషన్లు ఇచ్చే విషయంలో రాంబాబుని దారుణంగా మోసం చేశాడు. తాను ఎంతో ప్రేమగా చూసుకునే భార్య మోసం చేసి వెళ్లడంతో రాంబాబు మానసికంగా కృంగిపోయాడు. అప్పటి నుంచి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. అదే సమయంలో కూతురు, కొడుకు కూడా రాంబాబుని దగ్గరికి రానివ్వకపోవడంతో సైకోగా మారిపోయాడు. అప్పటి నుంచి ఆడజాతిని మొత్తం అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 6న వాచ్మెన్ దంపతులను మొదటగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం చనిపోయినది మహిళా కాదా అనే తెలుసుకునేందుకు ప్రైవేటు పార్ట్స్ను చూసేవాడని పోలీసులు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రాంబాబు మొత్తం మూడు హత్యలు చేశాడు. మరో మహిళను కూడా చంపేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. రాంబాబు అద్దెకు ఉన్న ఇంట్లో కూడా క్షుద్ర పూజలు చేసేవాడని.. పిచ్చి పిచ్చిగా కేకలు వేసేవాడని ఇల్లు ఖాళీ చేయించాడు. గత కొంత కాలంగా నగరంలో భయాందోళనకు గురి చేస్తుస్తూ.. మహిళలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న సైకో కిల్లర్ రాంబాబును అరెస్టు చేసినట్లు నగర సీపీ శ్రీకాంత్ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ప్రేమించి పెళ్లి.. వివాహమై ఐదేళ్లు అవుతున్నా!
ఇది చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఏడాది తిరగకముందే!