కమలమ్మ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట్లో పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అలాంటి సమయంలో వారికి కింగ్ కోహ్లీ ఎంతో సహాయపడ్డాడు.
ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఏంటి? ఓ హంతకుడ్ని పట్టించటం ఏంటి? అని మీరు అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.. కోహ్లి ఓ హత్య కేసును ఛేదించటంలో సహాయం చేశాడు. అయితే, నేరుగా కాదు.. పరోక్షంగా సహాయం చేశాడు. ఓ వృద్ధురాలి హత్య కేసును సాల్వ్ చేయటంలో కీలక పాత్ర పోషించాడు. ఇంతకీ సంగతేంటంటే.. 82 ఏళ్ల కమలమ్మ అనే వృద్ధురాలు బెంగళూరులోని మహాలక్ష్మిపురంలో నివసిస్తూ ఉండేది. కొద్దిరోజుల క్రితం కమలమ్మను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఇంట్లోని నగలు, డబ్బు దోచుకెళ్లారు.
హత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. అయితే, వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అలాంటి సమయంలో కమలమ్మ ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ ఆటో అనుమానాస్పందంగా కనిపించింది. ఆ ఆటో వెనకాల కింగ్ కోహ్లి అని రాసి ఉంది. దీంతో పోలీసులు కింగ్ కోహ్లి అని రాసి ఉన్న ఆటో కోసం అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే అంజనా మూర్తి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో అంజనామూర్తి నిజం ఒప్పుకున్నాడు. ఐపీఎల్ బెట్టింగుల కారణంగా తాను అప్పుల పాలు అయ్యాయని, ఆ అప్పులు తీర్చడానికి కమలమ్మను చంపానని తెలిపాడు. హత్య అనంతరం డబ్బు, నగలు దోచుకుని వెళ్లినట్లు వెల్లడించాడు. తనతో పాటు సిద్దరాజు, అశోక్లు కూడా భాగం అయినట్లు చెప్పాడు. పోలీసులు మిగిలిన ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.