ఈ మద్య మహిళలపై అత్యాచారాలు, హత్యలు మరీ ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది హత్య చేసి ఆనవాలు లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేయడంతో పోలీసులకు పట్టుబడతారు.
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే అసహనానికి గురైతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. తాము చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడాకి పలు నేరాలు చేస్తున్నారు. నేరం చేసిన వారు ఎన్ని రకాలుగా తప్పించుకునే ప్రయత్నం చేసినా.. ఎప్పుడో ఒకసారి చట్టానికి దొరిపోతారు. ఓ వ్యక్తి హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. కానీ అతడు చేసిన చిన్న తప్పిదం అతన్ని పట్టించింది. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం తగరపువలస సంతపేట ప్రాంతంలో ఈ నెల 11న ఓ మహిళ మృతదేహం అత్యంత దారుణమైన పరిస్థితిలో కనిపించింది. మహిళ పొట్ట దిగువన కత్తితో అత్యంత కిరాతకంగా గాయపరిచి ఉంది. హత్యచేసిన వాడు మృతదేహంపై తన కసి అంతా తీర్చుకున్నట్టు కనిపించింది. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్ట్ తో హత్య నిర్థారణకు వచ్చారు పోలీసులు. ఈ క్రమంలో సీసీ కెమెరాలు పరిశీలించారు. మృతురాలు విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మి గా గుర్తించారు. బంధుతు లతో మాట్లాడి నిర్థారించుకున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, మృతురాలు చనిపోయే రెండు రోజుల ముందు నుంచి కనిపించకుండా పోయిందని.. ఎక్కడ వెతికినా కనిపించలేద కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు పోలీసులు. ఇక నిందితుడి వేటలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హత్య జరిగిన స్థలంలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఇక గ్రామంలోని అన్ని ప్రదేశాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు పోలీసులకు ఓ నెంబర్ గొడపై కనిపించింది. దాని గురించి గ్రామస్థులను ఎంక్వేయిరీ చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. 3807 అనేది ఓ బైక్ నెంబర్.. దాన్ని గ్రామస్థుల్లో ఒకరు గోడపై రాశారు. గ్రామంలో ఓ బైక్ పై వ్యక్తి అనుమానాస్పదంగా వెళ్లడం.. ముందు బాగంలో ఓ మూటను పెట్టుకొని ఉండటం గ్రామస్థులు గమనించారు. ఆ సమయంలో బైక్ కిందపడిపోయినపుడు అతను చాలా కంగారుగా గ్రామస్థులను చూశాడని.. అదే సమయంలో ఎందుకైనా మంచిదని బండి నెంబర్ 3807 గోడపై రాసినట్లు గ్రామస్థుడు తెలిపాడు. ఆ ఒక్క క్లూ నేరస్థుడిని పట్టించింది.
గ్రామంలో గోడపై రాసిన నెంబర్ ఆధారంగా పోలీసులు ట్రాక్ చేయగా AP39 HK 3807 బజాజ్ ప్లాటినా గా గుర్తించారు. తగరపువలస సమీపంలో వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో 3807 నెంబర్ కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో నేరస్తుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఆ మహిళ కొంతకాలం క్రితం పరిచయం అయ్యిందని.. డబ్బు విషయంలో తేడా రావడంతో కోపంతో హత్య చేశానని.. ముక్కలుగా చేసి తరలించే ప్రయత్నంలోనే పొట్టకింద గాయం చేసినట్లు తెలిపాడు. సమయం లేకపోవడంతో బెడ్ షీట్ లో చుట్టుకొని బైక్ పై తీసుకు వెళ్తున్న సమయంలో కిందపడగా గ్రామస్థులు గమనించినట్లు తెలిపారు. తగరపువలస వద్ద ఓ నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయినట్లు నేరస్తుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి గ్రామస్థులు రాసిన నెంబర్ హంతకుడిని పట్టించింది.