ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఐ స్వర్ణలత గురించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. నోట్ల మార్పు కేసులో ఆమెను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
విశాఖపట్నంలో ఆర్మ్ డ్ రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత నోట్ల మార్పిడి కేసులో అరెస్టు అయిన విషయం పోలీసు శాఖలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నోట్ల మార్పిడి కేసులో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షల్లో డబ్బులు వసూలు చేయడంతో ఆమె మీద ఐపీఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణలత గురించి సోషల్ మీడియాలో ఒక్కో విషయం బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే స్వర్ణలత జీవితంలో మరో కోణం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..
విశాఖలో కలకలం రేపిన నోట్ల మార్పిడి కేసులో ఆర్ఐ స్వర్ణలత నాయకత్వం వహించినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో స్వర్ణలతకు సంబంధించిన ఒక్కో విషయం బయటకు వస్తుంది. స్వర్ణలత హీరోయిన్ గా ‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్’ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతోందట. ఈ మూవీలో ఆమె పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. అంతేకాదు ఆమె డ్యాన్స్ పర్ఫామెన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే స్వర్ణలతో మరో కోణం కూడా బయటకు వచ్చింది.
ఆర్ఐ స్వర్ణలత ది సొంత జిల్లా అయిన విజయనగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్వర్ణ ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది పేద విద్యార్థులు, వృద్దులు, మహిళలు, అనాథలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. స్వర్ణలతపై కేసు నమోదు అయిన తర్వాత ఆమె గురించి ఒక్కో విషయం బయటపడుతున్న నేపథ్యంలో స్వర్ణ ఫౌండేషన్ కార్యాకలాపాలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, స్వర్ణ ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలు, పిల్లల విద్య, ఆరోగ్య సమస్యలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవాలనే ప్రాథమిక లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.