ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై పురుషుల లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యల విషయాలకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా అప్పుడప్పుడు పురుషులపై మహిళల దాడులు కూడా జరుగుతున్నాయి. ఓ యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూతి ఖండ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సమ్మిట్ బిల్డింగ్ లోని 15 వ అంతస్తులో అన్ ప్లగ్డ్ కోర్టుయార్డ్ అనే పబ్ ఉంది. గురువారం రాత్రి పబ్ వెలుపల ఓ యువకుడిపై ఇద్దరు అక్కడ అమర్చిన పూల కుండీలతో దాడి చేశారు. వీరి మద్య గొడవ మరింత ముదిరిపోతున్న సమయంలో అక్కడికి బౌన్సర్లు వచ్చి మహిళల బారి నుంచి విడిపించారు. ఇద్దరినీ చెరో వైపుకు తీసుకు వెళ్లారు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మొత్తానికి ఈ వీడియో పోలీసులు చూడటంలతో వారిపై కేసు నమోదు చేశారు. కాకపోతే బాధితుడి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అంతేకాదు బాధిత వ్యక్తికి ఏమైంది, ఆసుపత్రికి తరలించారా అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఆ యువకుడిపై మహిళలు ఎందుకు ఆ స్థాయిలో దాడి చేశారన్న విషయంపై స్పష్టత లేదు.
ఇదిలా ఉంటే.. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్గా తాగి అతనిపై దాడి చేశారని కొందరు.. ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకే దాడి చేశారని కొంతరు.. పబ్ కల్చర్ అంటేనే ఇలాగే ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
लखनऊ अनप्लग्ड कैफे के बाहर चले लात-घूंसे, लड़की ने एक शख्स को जमकर पीटा #Video Viral #Lucknow #UnpluggedCafe @Live_Hindustan pic.twitter.com/r8Ks3cVQAI
— Hindustan UP-Bihar (@HindustanUPBH) July 22, 2022
ఇది చదవండి: అలా ఉండగా వీడియోలు తీసి ఆ వెబ్సైట్కు అమ్మాడు!