దేశంలో కొందరు యువకులు బరితెగించి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై అందమైన ఆడది కనిపిస్తే చాలు అడ్డగోలుగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అక్కడి మీడియా కథనం ప్రకారం.. మొరాదాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక నివాసం ఉంటుంది. అయితే ఈ నెల 1న తమ పొరుగు గ్రామంలో జాతర జరగడంతో ఆ యువతి చూడడానికి వెళ్లింది. జాతర అనంతరం ఆ యువతి తిరిగి ఇంటి వస్తున్న క్రమంలో నలుగురు యువకులు ఆ బాలికను వెంబడించి కిడ్నాప్ చేశారు. తర్వాత ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు దారుణంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ బాలికను నగ్నంగా మీ ఇంటికి వెళ్లాలని బెదిరించారు. దీంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ బాలిక రోడ్డుపై అందరూ చూస్తుండగా నగ్నంగా నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లింది.
ఆ బాలిక అలా నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా వాహనదారులు వీడియోలు తీసి అనంతరం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలోకాస్త వైరల్ గా మారుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.