మరణం ఎవరికి, ఎప్పుడు ఎలా వస్తుందా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కొందరు వ్యక్తులు ఉన్నట్టుండి నేలకొరిగి గుండెపోటుతో మరణిస్తుంటారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఎమ్మెల్యే కూతురు గొంతులో ఆహారం ఇరుక్కుపోయి మరణించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్యకు పూనమ్ మౌర్య అనే కూతురు ఉంది.
గత 5 ఏళ్ల కిందటే రాజేంద్రమౌర్య కూతురు పూనమ్ మౌర్యను సంజయ్ మౌర్య అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. అప్పుటి నుంచి ఈ దంపతులు భోపాల్ లోని అయోధ్య నగర్ లో నివాసం ఉంటున్నారు. ఇక పెళ్లైన కాలం నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా గడుపుతున్నారు. అయితే బుధవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ తిని పడుకున్నారు. ఇక ఏం జరిగిందో ఏం తెలియదు కానీ ఉదయం భర్త సంజయ్ మౌర్య నిద్రలేచేసరికి భార్య పూనమ్ మౌర్య నిద్రలేవకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. తనను లేపే ప్రయత్నం చేశాడు.కానీ ఎంతకు కూడా పూనమ్ మౌర్య లేవలేదు. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆమె మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
దీంతో అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించడంతో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం ఊహించని వాస్తవాలు బయటపడ్డాయి. పౌనమ్ మౌర్య గొంతులో ఆహారం ఇరుక్కుని మరణించిందని రిపోర్టులో వెల్లడైంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి రాజేంద్ర మౌర్య హుటాహుటిన ఆస్పత్రికి తరలివెళ్లాడు. కూతురు మరణించిందన్న వార్త తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గొంతులో ఆహారం ఇరుక్కుని మరణించిన ఎమ్మెల్యే కూతురు ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.