ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చిరిగిన నోటు తీసుకోలేదని ఓ దుండగుడు డెలవరీ బాయ్ ను కాల్చి పారేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాజహన్ పూర్ లో సచిన్ కశ్యప్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే పిజ్జా షాపులో డెలవరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అయితే ఇటీవల రాత్రి 11 గంటలకు సచిన్ కశ్యప్ కు ఓ వ్యక్తి నుంచి పిజ్జా ఆర్డర్ వచ్చింది. వెంటనే ఆ ఆర్డర్ తీసుకుని డెలవరీ చేయడానికి ఆర్డర్ చేసిన యువకుడి ఇంటి వద్దకు వెళ్లాడు. అతనికి పిజ్జా ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. ఇక కొద్ది దూరం వెళ్లాక అతడు చిరిగిన నోటు ఇచ్చాడని తిరిగి సచిన్ అతని వద్దకు వెళ్లి చిరిగిన నోటు ఇచ్చావేంటి అని ప్రశ్నించాడు.
ఇక కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు సచిన్ కశ్యప్ ను ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో కాల్చాడు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అంతా ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సచిన్ కశ్యప్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దాడికి కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
थाना सदर बाजार #shahjahanpurpol ने की त्वरित कार्यवाही,
पिज्जा डिलीवरी ब्यॉय को गोली मारने वाले दोनों अभियुक्तों को किया गिरफ्तार, एक अवैध तमंचा 12 बोर मय कारतूस व घटना मे प्रयुक्त अवैध तमंचा 32 बोर मय जिन्दा/खोखा कारतूस बरामद ।#uppolice https://t.co/4q4U0PUQjx pic.twitter.com/YvegVTBIEp— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) August 26, 2022