ఓ యువకుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే ఓ మహిళ ముక్కు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ యవకుడు ఎందుకు అలా చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే ఓ మహిళతో గొడవ పెట్టుకున్నాడు. ఇక కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు.. పదునైన ఆయుధంతో ఆ మహిళ ముక్కు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు ఆ మహిళను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆ యువకుడు ఎందుకు ఆ మహిళ ముక్కు కోశాడు? దీని ఏం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటుంది. స్థానికంగా ఉండే రాజేష్ అనే యువకుడు గత కొన్నాళ్ల నుంచి ఆ మహిళను వేధించాడు. ఆ ఇల్లాలు కొన్ని రోజులు మౌనంగా భరించింది. ఇక రాను రాను రాజేష్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తట్టుకోలేకపోయిన ఆ వివాహిత ఇతడి వేధింపులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొన్నిరోజుల తర్వాత రాజేష్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అయినా బుద్ది మార్చుకుని రాజేష్.. ఇటీవల మరోసారి ఆ మహిళను నడిరోడ్డుపై అడ్డుకున్నాడు.
నా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఆ మహిళతో గొడవకు దిగాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన రాజేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ మహిళ ముక్కుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే గమనించిన కొందరు స్థానికులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆ మహిళ కుటుంబ సభ్యులు రాజేష్ పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. క్షణికావేశంలో మహిళ ముక్కు కోసిన యువకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.