తిరుపతి జిల్లాలోని బ్రహ్మణపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి నాగరాజు కారులో దగ్దమై హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే నాగరాజు హత్యకు గురికావడంతో అతని భార్య సులోచన, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి భార్య చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సులోచన సంచలన నిజాలు బయటపెట్టింది.
తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని ఐటీ ఉద్యోగి నాగరాజు హత్య స్థానికంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అతడు కారులో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో భాగంగా మృతుడు నాగరాజు భార్య సులోచన తాజాగా సంచలన నిజాలు బయటపెట్టింది. అసలు నాగరాజు భార్య చెప్పిన నిజాలు ఏంటి? ఈ ఘటన వెనుక జరిగింది ఏంటంటే? తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బ్రహ్మణపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి నాగరాజు కారులో దగ్దమై హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాగరాజు హత్యకు గురికావడంతో అతని భార్య సులోచన, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి భార్య చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సులోచన సంచలన నిజాలు బయటపెట్టింది.
నా భర్త సోదరుడు పరుషోత్తం బ్రహ్మణపల్లికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, గత కొంత కాలం నుంచి ఇద్దరూ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అయితే శివరాత్రి రోజు పురుశోత్తంతో ఆ మహిళ మాట్లాడుతుండగా ఆమె భర్త వితింజయ్ చూశాడు. దీంతో అతడు పురుషోత్తంతో గొడవకు దిగాడు. ఇదే విషయంపై వితింజయ్ సోదరుడైన గ్రామ సర్పంచ్ చాణక్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు, కానీ, ఈ క్రమంలోనే పురుషోత్తంను చంపేందుకు వితింజయ్, అతని సోదరుడు సర్పంచ్ చాణక్య గత నెల నుంచే ప్లాన్ వేశారు. అనేక సార్లు చంపేస్తామంటూ కత్తితో బెదిరించారరు. ఇక ఈ విషయం తెలుసుకున్న నా భర్త నాగరాజు అతని సోదరుడైన పురుషోత్తంను కనిపించకుండా బెంగుళూరుకు పంపించారు.
అప్పటి నుంచి సర్పంచ్ చాణక్య, వితింజయ్ నా భర్త నాగరాజు పంచాయితీ నడుస్తూనే ఉంది. అయితే తాజాగా సర్పంచ్ చాణక్య నా భర్త నాగరాజుకు ఫోన్ చేసి.. నీతో మాట్లాడాలంటూ బయటకు రమ్మన్నారు. దీంతో నా భర్త నాగరాజు వెంటనే కారులో వారు చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., అదే రోజు రాత్రి 9 గంటలకు నా భర్త నాగరాజుకు నేను ఫోన్ చేస్తే.. 20 నిమిషాల్లో ఇంటికి వస్తానని ఫోన్ కట్ చేశాడు. మళ్లీ ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. ఇక రాత్రి 12 గంటలకు నాగరాజు స్నేహితులు నాకు ఫోన్ చేసి.. గంగుడుపల్లె వద్ద మీ కారుకు ఎవరో నిప్పంటించారని తెలిపారు.
వెంటనే మా మామ ఘటనా స్థలానికి చేరుకుని చూడగా నా భర్త నాగరాజు కారులో కాలి బూడిదై కనిపించాడు. ఇదంతా పక్కా ప్లాన్ తో నా భర్తను దారుణంగా హత్య చేశారని మృతుడి భార్య సులోచన సంచలన నిజాలను బయటపెట్టింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, వారికి శిక్ష పడేంత వరకూ నేను వెనకడుగు వేయనని సులోచన మీడియాతో వివరించింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్, చాణక్య, వితింజయ్ మరి కొంతమంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చంద్రగిరి పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. మృతుడి నాగరాజు భార్య సులోచన ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.