అక్రమ సంబంధం అంటే.. సమాజంలో ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. చాలా మంది కట్టుకున్న వాళ్ల కంటే తప్పుడు సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సంబంధాల కోసం అయిన వాళ్లని, కడుపున పుట్టిన పిల్లలను కూడా నిర్మొహమాటంగా కడతేరుస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది అంత వైలెంట్ స్టోరీ కాదులెండి. ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. మీరు సినిమాల్లో చూస్తూనే ఉంటారు కదా అలాంటి ట్విస్టులు చాలానే ఉంటాయి. సింగిల్ లైన్లో చెప్పాలంటే.. ప్రియుడు కావాలని భార్య.. భార్యే కావాలని భర్త.. మరో మహిళని తెచ్చినా నాకు ఓకే అంటున్న మరో భార్య. ఇది వీళ్ల పంచాయితీ. దీనిని తీర్చలేక పోలీసులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. మరి.. వాళ్ల కథేంటో చూడండి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. మార్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో జీవన్లాల్ పానికా అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈ జీవన్లాల్ పానికాకి నలుగురు పిల్లలు ఉన్నారు. అతినికి బంధువు, మిత్రుడైన రాజేంద్రప్రసాద్ పానికా అనే వ్యక్తి పెంద్రా అనే గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్- రాఖీ పూరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు తరచూ కలుస్తూ ఉంటాయి. బంధువులు మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అనమాట. ఇలా తరచూ కలుస్తున్న నేపథ్యంలో జీవన్ లాల్ పానికాకి రాజేంద్ర ప్రసాద్ భార్య రాఖీ పూరి మధ్య చనువు పెరిగింది. వీళ్లు తరచూ సన్నిహితంగా మెలగడం మొదలు పెట్టారు. వీరి మధ్య పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారింది.
సమయం చూసుకుని జీవన్ లాల్- రాఖీ పూరీ ఇద్దరూ ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఆరు నెలలు గడిచినా కూడా వారి జాడ తెలియలేదు. ఆరు నెలల తర్వాత రాఖీపూరి బంధువులు జీవన్ లాల్ ఇంటికి వెళ్లారు. వారందరినీ రాజేంద్ర ప్రసాద్ తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న జీవన్ లాల్- రాఖీపూరి జంట తిరిగి వచ్చారు. వీళ్ల పంచాయితీ పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కింది. జీవన్లాల్- రాజేంద్ర ప్రసాద్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ తమపై దాడిచేశాడని జీవన్లాల్ తల్లి కేసు పెట్టింది. రాఖీ పూరీ భర్త వద్దకు వెళ్లాలని అడ్డం తిరిగింది. రాజేంద్ర ప్రసాద్ తనని వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. జీవన్ లాల్- రాజేంద్ర ప్రసాద్ మధ్య పెద్ద గొడవే జరిగింది.
ప్రియుడు లేకుండా బతకలేనంటూ రాఖీ పూరీ చెప్పుకొచ్చింది. అయితే ఆమె లేకపోతే నేను బతకలేనంటూ రాజేంద్ర ప్రసాద్ వాపోయాడు. ఇంకోవైపు జీవన్ లాల్ భార్య కొన్ని వింత కామెంట్స్ చేసింది. తన భర్త మరో మహిళను తీసుకొచ్చినా కూడా తనకు అభ్యంతరం లేదంటూ చెప్పుకొచ్చింది. ఒకవేళ రాఖీ పూరిని తీసుకొచ్చినా ఆనందంగానే కలిసి జీవిస్తామంటూ చెప్పింది. ఈ వింత లవ్స్టోరీ చూసి పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. ఆమె మేజర్ కావడంతో ముందు తల్లిదండ్రులకు అప్పగించారు. రాజేంద్ర ప్రసాద్పై చేసిన ఆరోపణలపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మాత్రం ప్రస్తుతం రాష్ట్రం మొత్తం వైరల్ అవుతోంది.