ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తూ.. ఆవేదనకు లోనై మనస్థాపానికి గురవుతున్నారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న యూత్ డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్న ఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వల్ల కుటుంబాల్లో విషాదాలు నిండుకుంటున్నాయి. ఉన్నత చదువు అభ్యసించేవారు కూడా కొన్నిసార్లు డిప్రేషన్ లోకి వెళ్లి తప్పుడు నిర్ణయాలు తీసుకొని బలవన్మరణాల పాల్పపడుతున్న ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బాస ర్ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుట్ ఐటీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వడ్ల దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన దీపిక సహ విద్యార్థులతో కలిసి వార్షిక పరీక్షలు రాసింది. తర్వాత బాత్ రూమ్ కి వెళ్లి వస్తానని వెళ్లిన దీపిక చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో అక్కడ ఉన్న విద్యార్థినులు సిబ్బందికి తెలియజేశారు. భద్రతా సిబ్బంది వెళ్లి బాత్ రూమ్ తలుపు పగులగొట్టి చూడగా దీపిక చున్నీతో ఆత్మహత్యయత్నానికి పాల్పపడింది. అప్పటికే ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు మొదట క్యాంపస్ హెల్త్ సెంటర్ లో ప్రథమ చికిత్స చేశారు. తర్వాత భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయం దీపిక తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ అధికారులు సమాచారం అందించారు. వార్షిక పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్థిని ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీపిక ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే దీపిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.