మొన్నటి వరకు చికెన్ ధరలు పెరిగి.. మాంసాహార ప్రియులకు నిద్రలేకుండా చేశాయి. కేజీ చికెన్ రూ. 350 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. టమాటా, ఉల్లి, కందిపప్పు వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు..
ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగదు సామాన్యుడికి. మొన్నటి వరకు చికెన్ ధరలు పెరిగి.. మాంసాహార ప్రియులకు నిద్రలేకుండా చేశాయి. కేజీ చికెన్ రూ. 350 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. టమాటా, ఉల్లి, కందిపప్పు వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతుంటే.. కోడి మాంసం ధరలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. అయితే సామాన్యంగా కిలో చికెన్ ధర మహా అయితే ఒక 20 నుండి రూ. 50 రూపాయలు మాత్రమే తగ్గుతుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర రూ. 250 పలుకుతుంది. ఇలాంటి సమయంలో ఓ చికెన్ షాపు యజమాని పెట్టిన ఓ బంఫర్ ఆఫర్ మాంస ప్రియులను ఫుల్ ఖుషీ చేసింది.
ఇంతకు అతడు పెట్టిన ఆఫర్ ఏంటంటే.. కిలో చికెన్ వంద రూపాయలే. అరే అవేవే చనిపోయిన లేదా రోగం వచ్చిన కోళ్లు అనుకుంటున్నారేమో. కానే కాదండీ బాబు. ఈ ఆఫర్ పెట్టింది కూడా మాంసాహార ప్రియులకు ఫేమస్ డే అయిన ఆదివారం రోజున. ఇంతకు ఆ ధర్మప్రభువుదీ ఏ ఊరు అనుకుంటున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా. ఖానాపూర్ లో ఆర్ఆర్ చికెన్ సెంటర్ యాజమాని ఈ ఆఫర్ పెట్టారు. ఇక ఏముందీ పొద్దునే షాపు ముందు క్యూ కట్టేశారు ఆ ఊరి ప్రజలు. ఈ ఆఫర్ ఒక్క రోజే కావడంతో తండోపతండాలుగా, హీరో తొలి రోజు ఆటకు వచ్చినంత మంది జనాలు వచ్చారట. రూ.100కే కిలో చికెన్ అనగానే ఎగబడ్డారు. ఈ సమయంలో తోపులాట కూడా జరిగిందట. చివరకు తమకు నచ్చినన్నీ కిలోలు తీసుకెళ్లి.. పండుగ చేసుకున్నారట జనం. మళ్లీ వచ్చే ఆదివారం కూడా పెడితే బాగుందని జనాలు ఆశపడుతున్నారట.