జంక్ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరికి తెలుసు. అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా వాటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలా ఓ తల్లి చేసిన చిన్న తప్పుకు రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడికి తల్లి నూడుల్స్ తినిపించాలని అనుకుంది. కానీ అవితిన్న ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్ తీసుకు వెళ్లినా ప్రాణాలు పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడుకు చెందిన శేఖర్, మహాలక్ష్మి భార్యాభర్తలు. ఈ దంపతులకు సాయి తరుణ్ అనే ఆరేళ్ల బాబు ఉన్నాడు. గత కొంత కాలంగా తరుణ్ అలర్జీ తో బాధపడుతున్నాడు. చిన్నారికి పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ బాబు కి ఎలాంటి జంగ్ ఫుడ్స్ పెట్టడానికి వీలు లేదని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే మహలక్ష్మి తన బాబు కోరుతున్నాడని నూడుల్స్ చేసి పెట్టింది. మిగిలింది తెల్లవారి తినే ఉద్దేశంతో ఫ్రిజ్ లో పెట్టింది. తెల్లవారిన తర్వాత మిగిలిన నూడుల్స్ తిన్నాడు.. కొద్ది సేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి అయ్యాడు.
సాయి తరుణ్ పరిస్థితి పూర్తిగా విషమించడంతో తల్లిదండ్రులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో గారాబంగా పెంచుకున్న తమ చిన్నారి కన్నుమూయడంతో తల్లిదండ్రులు విలవిలాడిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టానికి తరలించారు. అయితే నూడుల్స్ తినడం వల్లనా..? లేదా ఇతర కారణాల వల్ల చనిపోయాడా అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.