నేటికాలంలో కామంధులు వావివరసలు మరిచి బాలికల నుంచి వృద్దుల వరకు ఎవరినీ కూడా వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలా నల్లగొండ జిల్లాలో ఏకంగా 12 మంది ట్యూషన్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో నిందితుడికి న్యాయస్థానం సరైన శిక్షవిధించింది. తాజాగా కోర్టు వెలువరించిన తీర్పుతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసలు సంగతేంటంటే..? అది నల్లగొండ జిల్లా పెద్దవూర ఏనమిది తండా ప్రాంతం. ఇదే తండాలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ అర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థలో అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే 2014 జనవరి 3వ తేదీని రమావత్ హరీష్ నాయాక్ అన వ్యక్తి ఈ మైనర్ బాలికలకు ట్యూషన్ పేరుతో దారుణానికి పాల్పడ్డాడు. ఆ 12 మంది బాలికలను ఈ దుర్మార్గుడు ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఇదే విషయాన్ని సదరు బాలికల తల్లిదండ్రులు అప్పట్లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన రమావత్ హరీష్ నాయక్ కు గురువారం జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా దోషులకుగా గుర్తిస్తూ రూ.10 వేల జరిమానా కూడా విధించింది. గురువారం న్యాయస్థానం తీర్పుతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నరరూప రాక్షసుడికి సరైన శిక్షపడిందంటూ స్థానికులు చెబుతున్నారు. నిందితుడిపై జిల్లా కోర్టు తీసుకున్న తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.