‘న్యాయం కోసం వెళ్లిన నాకు అన్యాయం జరిగింది. ఓ లాయర్ నన్ను వేధిస్తున్నాడు’ అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్కాజ్ గిరి పోలీసులు వివరాల ప్రకారం.. పెళ్లైన రెండేళ్లకే ఓ యువతి(25)కి భర్తతో గొడవలు జరిగాయి. ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. భర్తతో విడాకులు తీసుకునేందుకు తాను నిర్ణయించుకుంది. గతేడాది జూన్ లో అందుకు సంబంధించి ఓ న్యాయవాదిని సంప్రదించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఆమెకు న్యాయం చేస్తానని చెప్పిన ఆ సదరు లాయర్ తరచూ తన ఆఫీస్ కు పిలిపించుకుని ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఆ చనువుతోనే తాను ఇల్లు మారేందుకు చూస్తున్నట్లు ఆమె చెప్పింది. అదే అదునుగా అతను ఉండే ప్రాంతంలోనే ఓ ప్లాట్ చూపించాడు. యువతికి తెలియకుండా ఆ ప్లాట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ యువతి దుస్తులు మార్చుకునే దృశ్యాలను చూపించి ఆమెను వశపరుచుకున్నాడు. రానురాను అతని వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక యువతి జనవరి 13న పోలీసులను ఆశ్రయించింది. ACP ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.