గత నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లో ఉన్నవారు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో ఉన్నవారు దగ్గరలోని చెరువులు, కుంటలు, బావుల్లో ఈత కొడుతూ సేద తీరుతున్నారు.
మనిషిని మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో తెలియాదు. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు అంటారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా మృత్యువడికి చేరుకుంటారు. ఈ మద్య గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, ఈతకు వెళ్లి చనిపోయిన ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సరదాగా నలుగురు ఈత కోసం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.
గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన నలుగురు కృష్ణా నదిలో ఈత కోసం వెళ్లారు. ఈ మద్య ఎండలు మండిపోతున్నాయి.. ఇంట్లో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పట్టణాల్లో ఉన్నవారు సమీపంలోనీ స్విమ్మింగ్ ఫూల్స్ కి వెళ్తుంటే.. గ్రామాల్లో ఉన్నవారు దగ్గరలోని కెనాల్స్, చెరువులు, బావుల్లో ఈతకు వెళ్తూ సేద తీరుతున్నారు.
ఈ క్రమంలో అప్పుడప్పుడు విధి వక్రించి ప్రాణాలు పోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా కృష్ణా నదిలో ఈత కోసం వెళ్లిన నలుగురు ప్రమాద వశాత్తు మునిగిపోయి చనిపోయారు. మృతులు అఫ్రిన్(7), సమీర్(18), నౌషన్(7), రిహాన్ (15) గా గుర్తించారు. అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా గడిపిన పిల్లలు ఒక్కసారే కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.