గత నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లో ఉన్నవారు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో ఉన్నవారు దగ్గరలోని చెరువులు, కుంటలు, బావుల్లో ఈత కొడుతూ సేద తీరుతున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో పలు చోట్లు చెరువులు, కాలువలు నీటితో నిండిపోయాయి. వేసవి కాలం కావడంతో కొంతమంది ఈతకోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు.