డబ్బు..రెండు అక్షరాల ఈ పదం మనిషిని ఎలాగైన మార్చేస్తుంది. మనిషి స్థితిని డిసైడ్ చేసేది డబ్బేనని చాలా మంది బలంగా నమ్ముతారు. అంతేకాక బంధాలను తెంచాలన్న, బంధాలను ఏర్పచుకోవాలన్న డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాక ధనం అనేది మిత్రువులను శత్రువులుగా మార్చే శక్తి ఉంది. ప్రాణ స్నేహితుల మధ్య శత్రుత్వం పెంచడంలో డబ్బు ఓ ప్రధాన కారణం. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో డబ్బుల కోసం, ఆస్తి కోసం ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను హత్య చేసేవారు ఎక్కువయ్యారు. తాజాగా తన స్నేహితుడు పేరున్న ఉన్న రూ.4 కోట్ల బీమా డబ్బుల కోసం హత్యకు కొందరు తెగబడ్డారు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్రలోని నాసిక్ లో అర్జున్ రమేశ్ భలేరావ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో అతడికి స్నేహితులు ఎక్కువగా ఉన్నారు. అర్జున్ వారితో ఎంతో సరదాగా ఉండే వారు. అర్జున్ రమేశ్ పేరున రూ.4 కోట్లు బీమా పాలసి ఉంది. ఇదే విషయం అతడి స్నేహితులకు తెలిసింది. దీంతో స్నేహం కంటే వారికి డబ్బు మీద ఆశపుట్టింది. దీంతో డబ్బులు కాదు స్నేహమే శాశ్వతం అనే విషయాన్ని మరచి.. అర్జున్ రమేశ్ ను ఎలాగైన చంపాలని భావించారు. అంతేకాక అతడి పేరున ఉన్న ఆ నాలుగు కోట్ల రూపాయాలను కాజేయాలను పథకం వేశారు. అయితే బీమా చేయించిన తరువాత రమేశ్ మూడేళ్ల పాటు నాసిక్ లో లేడు. దీంతో అతన్ని చంపేందుకు వారికి అవకాశం కుదరలేదు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల రమేశ్ నాసిక్ కి తిరిగి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన అతడి నలుగురు స్నేహితులు మరో మహిళతో సాయంతో హత్య చేశారు. బీమా డబ్బులు రావాలన్న, తాము పోలీసులకు దొరకకుండా ఉండాలన్న.. రమేశ్ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలని భావించారు. అందుకు తగినట్లే అందరిని నమ్మించారు. రమేష్ బైక్ మీద వెళ్తుంటే వెనక నుండి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని చెప్పారు. పోలీసులు సైతం అలాగే కేసును నమోదు చేశారు. హత్య విషయంలో అందరిని నమ్మించిన వాళ్లు.. ఇక బీమా డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేశారు. రజిత్ భార్య రజినీ పేరుతో వారితో పాటు ఉన్న మహిళ వివరాలు సమర్పించింది. వారికి రమేష్ పేరున ఉన్న రూ.4 కోట్లు డబ్బులు వచ్చాయి.
ఇంత వరకు బాగానే ఉన్నా.. చేసిన పాపం ఊరికే పోదు..వెంటాడుతుందని పెద్దలు అన్నట్లు.. డబ్బుల పంచుకునే సమయంలో వివాదం జరిగి అసలు విషయం బయటకి వచ్చింది. డబ్బులు పంచుకునే సమయంలో తనకు తక్కువ ఇచ్చారంటూ ఓ వ్యక్తి వాదన దిగ్గాడు. హత్య విషయాన్ని అర్జున్ రమేశ్ సోదరుడికి చెప్పాడు. దీంతో మృతుడి సోదరుడు వెళ్లి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో వీరి వ్యవహారం అంతా బయటపడింది. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరి నుంచి తుపాకీ, 6 తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా ఈ వార్త సంచలనంగా మారింది. నమ్మిన స్నేహితులే డబ్బుల కోసం హత్య చేశారని విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.