ఫుడ్ సెంటర్ నిర్లక్ష్యంగా కారణంగా ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ షాక్ కి గురిచేసింది. షవర్మా తినడం వల్ల ఈ 16 ఏళ్ల యువతి తోపాటు మరో 15 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన కేరళోని కాసరగాడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని చెరవథూర్ ఏరియాలో దేవానంద అనే 16 ఏళ్ల యువతి ఉంటోంది. నిత్యం స్టడీలో భాగంగా దగ్గర్లోని ట్యూషన్ సెంటర్ కి వెళ్తుండేది. ఈ క్రమంలో ఏప్రిల్ 29న తేదీన అలానే ట్యూషన్ సెంటర్ కి వెళ్లింది. బ్రేక్ టైంలో అక్కడే ఉన్న జ్యూస్ కమ్ ఫుడ్ సెంటర్ లో షవర్మా తినింది. అదే సమయంలో ఆమెతో పాటు మరో 15 మంది విద్యార్థులు షవర్మా తిన్నారు. ఈ షవర్మా విద్యార్థులకు వికటించి.. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న దేవానంద పరిస్థితి విషమించింది. ఆదివారం మధ్యాహ్నం ఆ యువతి మృతి చెందింది. అయితే మిగత విద్యార్థుల ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో సదరు జ్యూస్ సెంటర్ ను సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుళ్లిపోయిన షవర్మాను వాళ్లకు ఇవ్వడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు గుర్తించారు. ఫుడ్ కోర్టుల నాణ్యతపై దృష్టి సారించాలని సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించింది. ఇది ఇలా ఉంటే.. మరణించిన దేవనంద తండ్రి కూడా ఐదు నెలల కిందటే ఫుడ్ పాయిజన్ వలనే కన్నుమూశాడు. కలుషిత ఆహారం తిన్న దేవానంద తండ్రి ఆనారోగ్యంతో ఏడాదిన్నారగా మంచం పట్టి.. ఐదు నెలల క్రితం కన్నుమూశాడు. దీంతో అప్పుడు భర్త, ఇప్పుడు కూతురు ఫుడ్ పాయిజన్ బారిన పడి చనిపోవడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా విలపిస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.